డిజాస్టర్ “లైగర్” విషయంలో పూరీని మెచ్చుకొని తీరాల్సిందే..!

విజయ్ దేవరకొండ అలాగే బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే లు హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ సినిమా లైగర్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే విజయ్ కూడ పాన్ ఇండియా ఎంట్రీ చాలా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు.

మరి ఈ సినిమాకి తగ్గట్టే దర్శకుడు పూరి జగన్నాథ్ భారీ ప్లానింగ్స్ హంగులు అద్దారు. కానీ తీరా చూస్తే సినిమాలో మేటర్ లేదని తేలిపోవడంతో ఇక ఈ సినిమా జరిగిన బిజినెస్ కి గాను భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది ఆచార్య సినిమా అనుకుంటే దానిని మించి నష్టాలు మిగిల్చిన సినిమాగా ఇది నిలిచి షాకిచ్చింది.

దీనితో వెంటనే నిర్మాతలపై డిస్ట్రిబ్యూటర్ లు దండెత్తగా దీనిని దర్శకుడు పూరి జగన్నాథ్ ఇపుడు చక్కగా హ్యాండిల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు పూరి జగన్నాథ్ ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలను తీరుస్తున్నాడట.

చాలా మొత్తంలో అమౌంట్ ని అనేకమంది డిస్ట్రిబ్యూటర్ ల ఖాతాలో తాను వేసాడని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి ఈ విషయంలో అయితే పూరి జగన్నాథ్ ని మెచ్చుకొనే తీరాలి. మరి హిందీలో నష్టాల విషయంలో అయితే ఏం చేసారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.