కొత్త ట్రిక్: ‘ఆర్ ఎక్స్ 100’ తో పోలుస్తూ పబ్లిసిటీ

తమ సినిమా ప్రమోషన్ కోసం రకరకాలు మార్గాలు తొక్కుతూంటారు సినిమా జనం. ఎవరూ అనని మాటలన్ని తామే అనేసుకుని తమ సినిమాకు పబ్లిసిటీ తెచ్చుసుకుందామని ప్రయత్నిస్తారు. అయితే అవి ఒక్కోసారి నవ్వులు పాలవుతూంటాయి. అలాంటిదే నాటకం సినిమా టీమ్ కు రీసెంట్ కు జరుగుతోంది.  ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా.. ‘ఆర్ ఎక్స్ 100’ తో పోల్చి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు..‘నాటకం’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ ని తీసుకొచ్చారు. . ఈ సందర్బంగా కార్తికేయ చేసిన ప్రసంగం లో ఈ నాటకం సినిమాని బాగా ఎత్తేసారు.

కార్తికేయ మాట్లాడుతూ…‘నాటకం’ సినిమాను ఎక్కువ శాతం మంది తాను నటించిన ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో పోలుస్తున్నారని చెప్పారు. అసలు రిలీజ్ కానీ సినిమాని ఎవరు ఏ సినిమాతో పోలుస్తారు. అయితే బోల్డ్ గా ట్రైలర్ కట్ చేసి, పోస్టర్ వదలటంతో కొంతమంది అలా ఫీలై ఉండవచ్చు. అయితే  ఆ విషయానికి తానేం గొప్పగా ఫీల్ కావడం లేదని – అది నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదని కార్తికేయ చెప్పుకొచ్చాడు.

అంతేకాదు..ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే మంచి విజయన్ని సొంతం చేసుకుంటుందని అర్థం అయ్యిందని అన్నారు.  తాను చేసిన ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రాన్ని పంపిణీ చేసిన శివమ్ సెల్యూలాయిడ్ వారు ఈ చిత్రాన్ని కూడా పంపిణీ చేయటం తనకు ఆనందంగా ఉందన్నాడు. తప్పకుండా ఈ చిత్రం ఆశిష్ గాంధీ మరియు ఆష్మిలకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చాడు.