“నన్ను దోచుకుందువటే “చిత్రానికి యు సర్టిఫికెట్

సుధీర్ బాబు , నభ నటేష్ జంటగా జంటగా నటించిన ‘ నన్ను దోచుకుందువటే ” చిత్రానికి సెన్సార్ క్లియర్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది . ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర బాబు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాను సెన్సార్ సభ్యులు నిన్న చూసి క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చారు . ఈ చిత్రంలో ఇంకా నాజర్, చలపతి రావు, పృద్వి , తులసి , వేణు, జీవ మొదలైన వారు నటించారు .
రామానాయుడు ఫిలిం స్కూల్ లో తర్పీదు పొందిన ఆర్ ఎస్ నాయుడు కు ఇది తొలి చిత్రం. అతను చేసిన షార్ట్ ఫిలిం చూసి సుధీర్ బాబు ఈ అవకాశం ఇచ్చాడు . అలాగే ఈ చిత్రం ద్వారా నభ నటేష్ అనే హీరోయిన్ ను పరిచయం చేశారు . సుధీర్ బాబు నటించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలావుందని , చాలాకాలం తరువాత ఓ చక్కటి చిత్రం చూశామని సెన్సార్ సభ్యులు తెలిపారు .
కార్తీక్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తాడు . తనంటే మిగతా ఉద్యోగులందరికీ హడల్ . చేస్తున్న పనిలో చిన్న తేడా వచ్చినా సహించదు . ఒకసారి నాయనమ్మ చనిపోతే వూరు వెడతాడు . అప్పుడు కార్తీకను మనబావ కూతురు సత్యను వివాహం చేసుకోమంటాడు . అది తప్పించుకోవడానికి తానూ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతాడు . అయితే ఆ అమ్మాయిని చూస్తానని తండ్రి హైదరాబాద్ వస్తాడు . తండ్రయిని నమ్మించడాని ఓ అమ్మాయిని నటించడాని ఒప్పిస్తాడు . ఆ అమ్మాయి పేరు మేఘం ఓ షార్ట్ ఫిలిమ్స్ నటి . వీరిద్దరి పరిచయం పెళ్లి వరకు ఎలాదారి తీసిందనేది ఈ సినిమా . చిత్రం ఆద్యంతం చక్కగా రూపొందించారు .
ఈ సినిమా ఈనెల 24న విడుదలవుతుందని దర్శకుడు తెలిపాడు .