‘లక్ష్మీస్ ఎన్టీఆర్’..వర్మ తాజా ప్రకటనలో ఏముందంటే..

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ట్వీట్స్ తో హల్ చల్ చేయటం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా వివాదాస్పద పోస్ట్ లకు వర్మ కేరాఫ్ ఎడ్రస్ గా మారాయి. అయితే ఎందుకనో ఆయన  ఈ మధ్యన కాస్తంత గ్యాప్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మరో సారి తన విశ్వరూప ప్రదర్శన చేసారు. ఆగిపోయిందనుకున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ని మళ్లీ పట్టాలు ఎక్కిస్తున్నానని చెప్పి సంచలనం సృష్టించారు. ఇంతకు ముందు ప్రకటన చేసినా కొద్ది రోజులు హంగామా తప్ప మొదలు కాకుండానే..ఆగిపోయింది. ఇప్పుడు విజయదశమి రోజు లాంచ్ చేస్తానంటూ నిర్మాతలు,బ్యానర్ పేరుతో సహా ప్రకటన చేసారు.


సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ లను బట్టి..  జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపొందించనున్నామని, ఈ
విజయదశమికి సినిమా స్టార్ట్ చేసి జనవరి చివరికల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తారని అర్దమవుతోంది.

అలాగే… ఈ చిత్రానికి సంభందించిన పూర్తి డిటేల్స్ ని అక్టోబర్ 19న పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నాడు. ఇక ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబు నాయుడు లతో కూడిన పాత పోస్టర్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ‘‘ఎన్టీఆర్ ట్రూ స్టోరీ’’ అనే హాష్‌టాగ్ జత చేసి షాక్ ఇచ్చారు.

ఇదిలో ఉంటే మరో ప్రక్కన క్రిష్ దర్శకత్వంలో బాలయ్య ‘ఎన్టీఆర్’ చిత్రం శరవేగంతో పూర్తి చేస్తున్నారు.   ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ద్వారా ఎన్టీఆర్
జీవితంలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాలు చూపనున్నాడని చెప్పుకుంటున్నారు. ఇది ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీ అవుతుందని చెప్పుకుంటున్నారు.