అబ్బే అలాంటిదేమీ లేదు ..కాకతాళీయమే అంటేనే అందరీకి డౌట్ వస్తుంది. అందరి దృష్టీ దానిపై వెళ్తుంది అదే వర్మ ఇప్పుడు చేస్తున్నారు. తన తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం గురించిన ఓ కీలక ప్రకటన చేసారు. ఆ ప్రకటనలో భాగంగా..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు కల్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.
బాలకృష్ణ ‘ఎన్టీఆర్’కు సంగీతం సమకూరుస్తున్న ఎమ్.ఎమ్. కీరవాణి సోదరుడైన ఆయన అనుకోకుండా మా సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇది నిజంగా కాకతాళీయంగా జరిగింది.. ఉద్దేశ పూర్వకంగా ఆయన్ను ఈ ప్రాజెక్టుకు తీసుకోలేదు’ అని వర్మ ట్వీట్ చేశారు. దీంతోపాటు కల్యాణి మాలిక్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
దాంతో వర్మ కావాలనే కీరవాణి సోదరుడుని తీసుకున్నాడని, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై పోటీగా తీసే తన సినిమాకు క్రేజ్ తేవటం కోసం ఇళా చేసాడంటున్నారు. ఇక నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.
రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని దసరా సందర్భంగా శుక్రవారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించారు. దీపావళికి ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నట్లు వర్మ తెలిపారు.