‘గీతాగోవిందం’ దర్శకుడు నెక్ట్స్ చిత్రం కాన్సెప్టు ఇదే ?

రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్టైన చిత్రం  ‘గీత గోవిందం’. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రూపొందిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం వంద కోట్లకి పైగా కలెక్ట్ చేసి భారీ బ్లాక్ బ్లస్టర్ గా నిలిచింది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం దర్శకుడు నెక్ట్స్ చేయబోయే చిత్రం ఏమిటనే ఆసక్తి సినిమా జనాల్లోనే కాక సామాన్యుల్లో కూడా ఉంది. అయితే పరుశురామ్ మాత్రం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.

ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. మైత్రీ మూవీస్‌ సంస్థలో ప‌ర‌శురామ్‌ తన తర్వాత సినిమా చేయబోతున్నారు. ఇక కాన్సెప్టు కూడా ఈ సారి చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని చెప్తున్నారు.  ఒక సామాన్యుడుకి  దేవుడికి సంబంధించిన కథ అని,వారిద్దరి మధ్య పుట్టిన ఓ వివాదం ఓ దిసకు చేరుకుంటుంది..మనిషి ఎలా దేవుడ్ని తన ఆలోచనలతో జయిస్తాడనేది ఎంటర్టైన్మెంట్ తో చెప్పబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని..అతని ఆలోచనలతో దేవుడ్ని సైతం ఒప్పించటం అనేది…బాగుటుందని , ఆ ట్రాక్ బాగా వచ్చిందని చెప్తున్నారు. మిగతా సీన్స్ కూడా రాసేసి అప్పుడు మిగతా పనుల్లో పడదామనే ఉద్దేశ్యంలో పరుశురామ్ ఉన్నట్లు తెలుస్తోంది.