కరోనా వైరస్ టాలీవుడ్ కి సోకిందా? కొవిడ్ -19 టాలీవుడ్ లోనూ పంజా విసరనుందా? అంటే అవుననే సమాచారం అందుతోంది. సోమవారం ఒక్కరోజే దేశంలో అధిక సంఖ్యలో కేసులు నమోదైన సంఖ్య తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లాక్ డౌన్ సండలింపు దిశగా కేంద్రం అడుగులు వేడయంతోనే కరోనా విజృంభిస్తోందని నివేదికలు చెప్పాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా అదుపులోకి వస్తోందనుకుంటే? సోమవారం ఒక్కరోజే ఒక్కసారిగా 75 కేసులతో పంజా విసిరింది. దీంతో ఎక్కడ నుంచి ఎలా సోకుతుందో అర్ధం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. తాజాగా నిన్న నమోదైన కేసులను పరిశీలిస్తే.. ఇందులో ఓ ప్రముఖ టాలీవుడ్ నటి కుమారుడు కూడా ఉన్నట్లు తేలింది. దిల్ షుక్ నగర్ .. తిరుమలానగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో 9మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో ఒకరు సినీనటి కుమారుడు కావడం విశేషం. ఇటీవలే ఇతను తిరుమలానగర్ లోని అత్తగారింటికి రావడంతో కరోనా బారినపడ్డారు. దీంతో అదే అపార్ట్ మెంట్ లో 27 మందిని కూడా పరిక్షల నిమిత్తం తరలించినట్లు తెలిసింది. అయితే ఆ నటి వివరాలు మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు.
ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా.. కొన్ని సడలింపులిచ్చిన సంగతి తెలిసిందే. ఇక దొడ్డి దారిన తప్పించుకుని తిరిగేవారు ఉన్నారు. ఇరుగు పొరుగు ఇండ్లకు తిరగడం కొనసాగుతునే ఉంది.. ఇలా అన్ని కోణాల్లో ఆ నటి కుమారుడు ఎక్కడెక్కడ తిరిగాడు? ఆ నటికి కరోనా పాజిటివ్ ఉందా లేదా? అని ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ నటి అంతకుముందే టాలీవుడ్ కు కేరాఫ్ అయిన జూబ్లీహిల్స్….బంజారా హిల్స్…మాదాపూర్ ఏరియాల్లో తిరిగొచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అదే గనుక నిజమైతే ఆ నటికి కరోనా పాజిటివ్ అని తేలితే టాలీవుడ్ లో టెన్షన్ తప్పదు. ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం కారణంగా టాలీవుడ్ లో కలకలం మొదలైంది.
