సెల‌బ్రిటీ ఫైట్: అత్త తో రాజీకి కోడ‌లు!

లాక్ డౌన్ కార‌ణంగా టాలీవుడ్ లో ఓ పెద్దింటి సెల‌బ్రిటీ ఫ్యామిలీ అత్తా-కోడ‌లి మ‌ధ్య వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్ లు లేక ఇంటికి ప‌రిమిత‌మైన కోడ‌లి పై అత్త పెత్త‌నం చెలాయించే ప్ర‌య‌త్నం చేసింది. లాక్ డౌన్ ఉన్నంత కాలం ఇంటి ప‌నుల‌న్నీ చక్క‌బెట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది అత్త‌. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఎవ‌రి ఇంటికి వాళ్లే ప‌రిమిత‌మాయే. ప‌నివాళ్లు ఎవ‌రు రాక‌పోయే. దీంతో ఇంటిలో వంట ప‌ని స‌హా అన్ని ప‌న‌లు ఆ కోడ‌లిపైనే ప‌డ్డాయి. పొద్దుట లేచి ఇల్లు ఊడ్చ‌డం..ఆటుపై ఇంటి స‌భ్యులంద‌రికీ టిఫిన్లు సిద్దం చేయ‌డం…ఆ వెంట‌నే మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం లంచ్…సాయంత్రం స్నాక్స్ …ఆ రాత్రికి మళ్లీ భోజ‌నం సిద్దం చేయ‌డం.

ఇలా ఆ అత్త షెడ్యూల్ వేసి కోడ‌లికి ఇచ్చింది. దీంతో ఆ కోడ‌లి శివ‌మెత్తింది. ప‌నుల‌న్నీ నేను చేస్తే మీరేం చేస్తారు? సూప‌ర్ వైజింగ్ చేస్తారా? అన్న‌ట్లు సీరియ‌స్ గా ఓ లుక్ ఇచ్చిందిట‌. రెచ్చిపోయిన అత్త పెత్త‌నానికి వ‌చ్చావా? కాపురానికి వ‌చ్చావా? అంటూ ధీటుగా రిప్లై ఇచ్చింది. దీంతో కోడ‌లికి ఈ మూడు నెల‌లు ప‌నులు త‌ప్ప‌లేదు. ఈ నేథ్యంలో ఇద్ధ‌రు మాట్లాడుకోవ‌డం లేద‌ని కూడా వినిపించింది. అయితే తాజాగా లాక్ డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో ప‌నొళ్లు కూడా ఒక్కొక్క‌రు ప‌నుల్లో జాయిన్ అవ్వ‌డంతో  ఆ కోడ‌లు ఇప్పుడు ఫ్రీ అయిందిట‌. గాయం ఏదో రోజు మానుతుంది అన్న చందంగా అత్త అప్పుడ‌న్న మాట‌ల్ని మ‌ర్చిపోయి మ‌ళ్లీ యాథావిధిగా కోడ‌లు అత్త‌తో మాట క‌ల‌ప‌డం మొద‌లు పెట్టిందిట‌.

పెద్దింటి కుటుబం అత్త‌తో లొల్లి ఎందుక‌ని చివ‌రికి రాజీకీ వ‌చ్చిందో ఏమో ఆ కోడ‌లు. ప్ర‌స్తుతం ఆ అత్త‌-కోడ‌లిద్ద‌రు మాట్లాడుకోవ డం…క‌లిసి బ‌య‌ట‌కు వెళ్ల‌డం…క‌లిసి ఇంటి ప‌నులు చేయ‌డం జ‌రుగుతుందిట‌. ఈ లాక్ డౌన్ ముగిసి..క‌రోనా వైర‌స్ అంతా అదుపులోకి వ‌చ్చి ప‌రిస్థితుల‌న్నీ యాధావిధిగా వ‌స్తే ఫ్యామిలీ అంతా ఓసారి అలా విదేశాలు ట్రిప్ వేసి రావాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారుట‌. కొన్ని నెల‌లుగా ఇంటికే ప‌రిమిత‌వ్వ‌డంతో ఆ ఫ్యామిలీకి మ‌హా బోర్ కొట్టేసిందిట‌. ఇంత‌కీ ఆ అత్తా-కోడ‌లు టాలీవుడ్ లో ఎవ‌రి ఫ్యామిలీకి సంబంధించిన వారు? అన్న‌ది అతి త్వ‌ర‌లో రివీల్ అవుతుంది.