ఎమ్ .ఆర్ .సీ అసోసియేట్స్ సంస్థ భగీరథ దర్శకత్వంలో నిర్మించే “అనుబంధం ” సినిమా పూజా కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్ లో ప్రారంభమైంది . ట్రిప్ ఆన్ సమర్పణలో డాక్టర్ ఎమ్ .ఆర్ .సీ వడ్లపట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఈ సందర్భంగా నిర్మాత ఎమ్ .ఆర్ .సీ వడ్లపట్ల మాట్లాడుతూ .”భగీరథ గారి దర్శకత్వంలో మేము నిర్మిస్తున్న “అనుబంధం ” చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తుంది , ఇప్పుడొస్తున్న చిన్న చిత్రాల్లో ఇదొకటి మాత్రం కాదు . ప్రతివారికి కళ్ళు చెమర్చుతాయి . సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలనే సంకల్పమే ఈ చిత్ర నిర్మాణానికి ప్రేరేపించింది . ఈ చిత్రం చూసిన చాలా మందికికను విప్పు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా ” అన్నారు
ఇక ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభమవుతుంది . డిసెంబర్ చివరికి పూర్తి చేస్తాము , ఈ చిత్రం కోసం ఇప్పటికే కొంత మంది నటీనటులను ఎంపిక చేశాము . మిగతా నటీనటులు , సాంకేతిక నిపుణలను ఎంపిక చేస్తామని నిర్మాత తెలిపారు .
ఫిబ్రవరి నుంచి భగీరథ గారి దర్శకత్వంలోనే “మాచలదేవి ” అనే చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించాము , స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యిందని నిర్మాత డాక్టర్ ఎమ్ .ఆర్ .సీ వడ్లపట్ల తెలిపారు.
దర్శకుడు భగీరథ మాట్లాడుతూ ” అనుబంధం అంటే కేవలం మనిషికి మనిషికి మధ్య వున్న బంధం మాత్రమే కాదు . మనిషికి జంతువులకు , మనిషికి మట్టికి వున్న బంధాలు కూడా మనల్ని కదిలిస్తాయి కన్నీళ్లు పెట్టిస్తాయి . అనుబంధం తరాల మధ్య పెరుగుతున్న అంతరం , మనిషిలో స్వార్ధం , స్వలాభం పెరిగితే ఫలితం ఈవిధంగా ఉంటుందో తెలియ జెప్పే చిత్రం “అనుబంధం “అన్నారు .
ఈ చిత్రాన్ని రూపొందించడాని ముందుకు వచ్చిన నిర్మాత వడ్లపట్ల గారికి కృతజ్ఞతలు , దీని తరువాత కాకతీయ సామ్రాజ్యం ప్రభువు ప్రతాప రుద్రుని ఆస్థానంలో రాజ నర్తకి మాచలదేవి . ఇదొక విభిన్నమైన కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రం అని భగీరథ తెలిపారు . ఇంకా సమావేశంలో మహేంద్ర , రామ్ రెడ్డి , రమేష్ , సురేష్ , మురళి ,రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
