సో.. తమన్నా వెరీ బిజీ!?

అందాల తార తమన్నా ఈ మధ్య కల్లబొల్లి కబుర్లతో కాలం గడిపేస్తోంది. కనిపించిన చోటల్లా ఇష్టం ఉన్నా, లేకున్నా సోది చెబుతోంది. ఆ సోది ఏంటో ఆమె మాటల్లోనే..’ పనిలేకుండా ఒక్కరోజు నేను ఉండలేను. అసలు ఏ రోజుకారోజు ఏ పనిచేయాలని వెతుక్కుంటూనే వుంటాను. ఓ రకంగా ఖాళీగా కూర్చోవడం చాలా కష్టం. వరుస సినిమాలతో బిజిగానే ఉన్నాను’ అంటూ తనకు తాను చెప్పుకుంటోంది తమన్నా. విషయంలోకి వెళితే.. ఇటీవల ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మహేష్‌బాబుతో కలిసి నృత్యాలు చేసింది. దీంతో టాలీవుడ్‌లో ఓ పుకారు హల్‌చల్ చేస్తోంది. తమన్నా చేతిలో సినిమాలు లేవని, అందుకే స్పెషల్ పాటలో కూడా నటించిందని, గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేకన్నా ఏదోవిధంగా కనపడ్డం మంచిదే కదా. అందులోనూ మహేష్‌బాబు సరసన అంటే మరింత మంచిది కదా అంటూ వినిపిస్తున్న వార్తలు. ఈ విషయం తమన్నా చెవిదాకా వెళ్లడంతో స్పందించింది. సరిలేరు నీక్వెవరులో స్పెషల్ పాటలో నటించడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందని, ఎఫ్2లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నాకిచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి ఈ అవకాశం ఇస్తే కాదనలేకపోయానని చెప్పుకొచ్చింది. ఓ రకంగా దర్శకుడి కోరిక మేరకే ఈ పాటలో నటించానని, దాదాపు గత సంవత్సరం 20 సినిమాలదాకా నటించిన నేను, ఈ చిత్రంలో ఈ పాటతో మంచి ముగింపు పలకాలని చేయడం కూడా ఓ సెంటిమెంట్ అని చెప్పుకొచ్చింది. నా గురించి అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయని, పనిలేక ఇంట్లో కూర్చున్నానని అనుకోవడం కరెక్టు కాదని చెప్పుకొచ్చింది. ఈ సంవత్సరంలో కూడా 360 రోజులు పనిచేస్తూనే ఉంటానని, కాల్షీట్‌లో డేట్స్ వుంటే ఏ భాషలోనైనా నటించాడానికి సిద్ధమంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన చేతిలో బోలే చుడియా, సీటీ మార్ చిత్రాలు ఉన్నాయని, పెట్రోమాక్స్, దటీజ్ మహాలక్ష్మి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది!? నమ్మేద్దామా? ప్చ్.. తమన్నా!?