బాహుబలి కి మరో అరుదైన గౌరవం

దర్శకధీరుడు రాజమౌళితో తీసిన బాహుబలి అంతర్జాతీయంగా ఎన్నో గౌరవాలను అందుకుంది. ఇంకా అందుకుంటూనే ఉంది అని చెప్పాలి. అవును తాజాగా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ‘బాహుబలి – ది బిగినింనింగ్’ ని ప్రత్యేక స్క్రీనింగ్ వేయనున్నారట.

అది కూడా నేపధ్య సంగీతాన్ని సినిమా చూసేటప్పుడు లైవ్ ప్లే చేశారట అక్కడి సింఫనీ ఆర్కెస్ట్రా. దీని కోసం బృందం లోని కీరవాణి, రాజమౌళి, అనుష్క, ప్రభాస్, రానా కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ అక్టోబర్లో జరగనుంది. అందువల్ల చిత్ర బృందం మొత్తం మళ్ళీ లండన్ పయనం కానున్నారు.