చైతూతో గీత గోవిందం ద‌ర్శ‌కుడా…హిట్ గ్యారెంటీనా?

మజిలీ, వెంకీ మామ తో సూపర్ హిట్స్ సాధించిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య , గీత గోవిందం వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో చిత్రాన్ని గద్దలకొండ గణేష్ లాంటి మాస్ హిట్ అందించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. నాగ చైతన్య 20 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు అతి త్వరలో తెలియజేయనున్నారు.

గీత గోవిందం సినిమా ఇంతటి ఘన విజయం తరువాత కూడా పరశురామ్‌ మరో సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. గీత గోవిందం సినిమా తరువాత స్టార్ హీరోతో సినిమా చేయాలని భావించాడు పరశురామ్‌. మహేష్ తో సినిమా కోసం చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ ఒకానొక ద‌శ‌లో సినిమా ఓకే అయిన‌ట్లే వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ ప్రాజెక్ట్ ఫైనల్‌ కాలేదు. తరువాత మరికొంత మంది స్టార్ హీరోలను ప్రయత్నించి పరశురామ్‌ ఫైనల్‌గా ఓ హీరోను ఒప్పించాడు. యువ సామ్రాట్‌ నాగచైతన్య 20వ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించనున్నాడు.

శనివారం ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఇటీవల ఈ సినిమాలో చైతూ లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.