మహాత్మా గాంధీ సినిమాను అద్భుతంగా తెరమీద చూపించిన అటెన్ బరో ను ఎవరు మర్చిపోలేరు . గాంధీ అహింసా సిద్ధాంతాన్ని నమ్మి , ప్రజలను సమాయత్తం చేసి బ్రిటిష్ పాలనకు తెర దించి మనకు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టాడు . గాంధీ చేసిన ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తి నిచ్చింది . ఈ చిత్రం వల్ల భారతీయ సినిమా రంగంలోని వృద్ధ కళాకారులు ఆర్ధికంగా లాభ పడ్డారు అనే విషయం చాలా మందికి తెలియదు .
గాంధీ జీవితాన్ని సినిమాగా నిర్మిస్తానని భారత ప్రభుత్వాన్ని సంప్రదించిన అటెన్ బరో బ్రిటిష్ దేశస్తుడు కావడం విశేషం . అటెన్ బరో బ్రిటన్ సినిమా రంగంలో పేరున్న నటుడు , దర్శకుడు కూడా . అతని ప్రతిభ ను గుర్తించి ప్రభుత్వం అటెన్ బరో కు అనుమతి ఇచ్చింది .

ఈ సినిమా కోసం బెన్ కింగ్స్ లే ను గాంధీ పాత్ర కోసం ఎంపిక చేశారు . ఈ సినిమాను గోల్డ్ క్రెస్ట్ ఫిలిమ్స్ , ఇంటర్నేషనల్ ఫిలిం ఇన్వెస్టర్స్ ,ఇండో బ్రిటిష్ ఫిలిమ్స్ మరియు నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి . 1982లో నిర్మాణం ప్రారంభమైంది . అప్పుడు ఎన్ .ఎఫ్ .డి .సి కి అధ్యక్షుడుగా పద్మశ్రీ డి .వి .ఎస్ రాజు గారు వున్నారు .
ఈ సినిమా గురించి అటెన్ బరో తో అనేక పర్యాయాలు రాజు సమావేశమయ్యారు . ఆయనకు సినిమా మీద సంపూర్ణమైన అవగాహన వుంది . స్వయంగా తెలుగు, హిందీ సినిమాలు నిర్మించాడు . అనేక ట్రేడ్ బాడీలకు మార్గదర్శకుడిగా వున్నాడు . సినిమా వారి కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచించేవాడు . గాంధీ సినిమా ప్రపంచంలోనే సంచలనం సృష్టిస్తుంది . ఆ విషయంలో ఆయనకు పూర్తి నమ్మకం వుంది . అందుకే ఈ సినిమా
ద్వారా వచ్చే లాభాల్లో ఐదు శాతం వృద్ధ కళాకారుల సంక్షేమం కోసం ఇవ్వాలనే ప్రతిపాదన అటెన్ బరో ముందు ఉంచాడు . ఆయన మిగతా నిర్మాతలతో మాట్లాడి చెబుతానని అన్నాడు . ఇది మంచి సూచన కాబట్టి అందరు ఒప్పుకున్నారు .

గాంధీ సినిమా విడుదలకు ముందు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు . అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ , ఆమె మంత్రివర్గ సహచరులు హాజరై చిత్రాన్ని చూశారు . గాంధీ సినిమా నవంబర్ 30 గాంధీ వర్ధంతి రోజు విడుదలైంది . ప్రపంచ ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు . 22 మిలియన్ డాలర్స్ నిర్మించిన ఈ సినిమా 127 మిలియన్ డాలర్లు వాసులు చేసింది . లాభాల్లో ఐదు శాతం అంటే ము కోట్ల రూపాయలు వచ్చాయి . ఈ డబ్బును ఆర్ధికంగా చితికి పోయిన సినిమా కాళాకారులకు ఫించన్ రూపంలో అందించారు .
పద్మశ్రీ డి .వి .ఎస్ రాజు కృషి తో భారతీయ కళాకారులు లాభపడ్డారు .
