ఎన్టీఆర్ కోసం నిజంగానే జనం కరువయ్యారా?అసలు నిజం ఏమిటో తెలుసుకోండి.!

తెలుగు సినిమా హీరోస్ లో భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో భీభత్సమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. ఇప్పుడు అయితే ఏకంగా ప్రపంచ స్థాయిలో భారీ క్రేజ్ ని తాను సొంతం చేసుకోగా ఇప్పుడు ఎన్టీఆర్ పట్టిందల్లా బంగారంలా మారింది.

అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ పలు సినిమా ఈవెంట్స్ కి కూడా హాజరు అవుతుండగా తాను వస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో లేటెస్ట్ గా “బింబిసార” ఈవెంట్ కి అంతా చూసారు. ఇక దీని తర్వాత ఎన్టీఆర్ గెస్ట్ గా మరో భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర” చిత్రం గ్రాండ్ ఈవెంట్ కి గాను ఎన్టీఆర్ రావాల్సి ఉంది.

అయితే అయితే ఈ సినిమా ఈవెంట్ ని నిన్న చాలా గ్రాండ్ గా ప్లాన్ చెయ్యగా చివర నిమిషంలో ఈ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసేసారు. అయితే దీనికి కారణం అసలు జనమే ఈ ఈవెంట్ కి రాలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరూ రాకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసుకొని సింపుల్ గా చేసేశారని కొన్ని కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

కానీ అసలు విషయం ఇందులో ఏమిటంటే అక్కడికి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తే ఆ సమయానికి అభిమానులు భారీ ఎత్తున వస్తారని అప్పుడు పరిస్థితి తాము కంట్రోల్ చేయలేమని పోలీసులు ముందే చేతులెత్తేశారట. దీనితో వేరే దారి లేక ఈ ఈవెంట్ ని మేకర్స్ ఆపుకొని సింపుల్ గా చేశారట. ఇదే ఇందులో అసలు నిజం అన్నట్టు తెలుస్తుంది.