కేసీఆర్‌కు సిగ్గు,శరం, లజ్జ లేవు: టిపిసిసి ఉత్తమ్

 

తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. అప్పుడే పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేసీఆర్ పై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డాడు. కేసీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అందుకు బహుమానంగా కేసీఆర్ కు ఓటమిని అందజేయాలన్నారు. కేసీఆర్ కు సిగ్గు శరం ఉండాలే.. లుచ్చా మాటలు కేసీఆర్ మాట్లాడుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కేసీఆర్ కు ఆయన భాషలోనే సమాధానం ఇచ్చారు. 

తెలంగాణ పౌరులంతా కూడా ఆలోచించాల్సిన సమయమిది. కుటుంబ పాలనకు నేటితో తెరపడింది. టిఆర్ ఎస్ పార్టీని బొందపెట్టి ఘోరి కట్టేందుకు ప్రజలంతా సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాన ప్రజలు అనే రీతిలో సాగనున్నాయన్నారు. చిత్తుచిత్తుగా టిఆర్ ఎస్ ను ఓడించాలన్నారు.  ఉత్తమ్ వాడిన ఘాటు వ్యాఖ్యలివే

సీఎం కేసీఆర్ కు సిగ్గు శరం ఉండాలే

లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడు

సోనియా కాళ్ళు పట్టుకున్నప్పుడు ఎటుపోయింది

కేసీఆర్ కుటుంబం బందీపోటులలాగా దోచుకుంది

లజ్జ లేకుండా మాట్లాడుతున్నాడు

కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు బొందపెట్టి గోరి కడుతారు

రోజులు దగ్గరపడే ముందస్తుకు పోయిండు 

కేసీఆర్ తెలంగాణ  రాష్ట్రాన్ని దోచుకున్న దొంగ 

ఎలక్షన్ కమీషన్ తో మ్యాచ్ ఫిక్స్ డ్ అయ్యిండు 

సీఎం కేసీఆర్ కు పోయే కాలం వచ్చింది లజ్జ లేకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మీకేమి తెలియదు.. ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన సమాచారం ఉందని వ్యాఖ్యానించారని అంటే కేసీఆర్ ముందే ఎన్నికల సంఘం తోటి మ్యాచ్ ఫిక్స్ అయ్యాడా అని ప్రశ్నించారు. అసెంబ్లీని డిసాల్వ్ చేసేదే ఎవ్వరికి తెలియదు అటువంటిది కేసీఆర్ ముందే ఎన్నికల సంఘంతోటి చర్చించాడంటే మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాడని ఉత్తమ్ నిలదీశారు.

మాట ఇచ్చి తప్పిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణను భారతదేశంలో నంబర్ 1 చేశాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణను రైతుల ఆత్మహత్యలో నంబర్ 1 చేశారు, మద్యం అమ్మకాల్లో నంబర్ 1 , అప్పుల్లో నం.1 చేశారని విమర్శించారు. మిషన్ భగీరథ గురించి చెప్పినవన్నీ సుద్ద అబద్దాలేనన్నారు. కేసీఆర్ తన గోతిని తానే తవ్వుకున్నాడని చేతకాక 9 నెలల ముందే ఎన్నికలకు పోతున్నాడన్నారు. గురువారంతో తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడమైందని ఉత్తమ్ అన్నారు.

షబ్బీర్ అలీ ఏమన్నారంటే…

బిడ్డా కేసీఆర్… నోరు దగ్గర పెట్టుకోని మాట్లాడు.. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావ్.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నావ్.. నీకు సిగ్గులేదా.. సోనియా గాంధీ కాళ్లు మొక్కినప్పుడు బుద్దిలేదా.. ఇవాళ రాష్ట్రాన్ని దోచుకున్నావు.. నీ బిడ్డ ప్రాపర్టీ ఎంతా నీ ప్రాపర్టీ ఎంతా లెక్క చెప్పాలే.. బిడ్డా కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడమైందని షబ్బీర్ అలీ అన్నారు.

డికె అరుణ ఏమన్నారంటే…

తెలంగాణ పెద్ద బఫూన్ నువ్వే.. పెద్ద మోసగాడివి నువ్వు.. ఖబడ్దార్ కేసీఆర్ నోరు జాగ్రత్త దగ్గరపెట్టుకొని మాట్లాడు.. కమీషన్ల కోసం కక్కుర్తి పడి రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు. కేసీఆర్ ఖబడ్దార్ ఇక కాస్కో.. అంటూ డికె అరుణ ఫైర్ అయ్యారు.