తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల అవుట్

తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. అసిఫిబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరుతున్నారు. వారు కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూ టిపిసిసికి లేఖ కూడా రాశారు. వారు పార్టీ వీడడంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఎదురు  దెబ్బ తగిలింది. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో నేతలు విఫలమయ్యారని స్వంత పార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి.  ఆదివారం ఉదయం వారు అధికారికంగా టిఆర్ఎస్ లో చేరనున్నారు.