రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకొని పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడుతున్నాడని కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ చేస్తున్న వ్యాఖ్యల పై మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తో కలిసి పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. రేవంత్ తన మాటలతో కొడంగల్ లో శాంతి భద్రతల విఘాతం సృష్టించే పని చేస్తున్నాడని వారు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఏమన్నారంటే…
“రేవంత్ రెడ్డి ఓటమి భయంతోనే చీఫ్ ట్రిక్స్ ప్రదర్శిస్తున్నారు. ప్రాణహాని అనేది రేవంత్ ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా. ఇలాంటి డ్రామాలు ఆడి రేవంత్ గెలుస్తున్నాడని కొడంగల్ ప్రజలకు అర్ధమయ్యింది. అలాంటి డ్రామాలకు ఇప్పుడు ఓట్లు పడవు. కొడంగల్ ప్రజలేమి పిచ్చి వారు కాదు. రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. మేము గెలిచే స్థాయిలో ఉండి రేవంత్ పై దాడి చేసే పిచ్చి ప్రయత్నం చేస్తామా. ప్రతిరోజు మీడియాలో ఉండి జిమ్మిక్కులు చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ప్రజలకు అర్ధమయ్యింది.

స్వంత నియోజకవర్గంలో భయం ఉన్నవాడు తెలంగాణ అంత ఎలా తిరుగుతున్నాడో చెప్పాలి. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన చంపుతరు.. కొడంగల్ లో ఏదో అయిపోతుంది అని మభ్య పెడితే ప్రజలు నమ్ముతారా.. రేవంత్ రెడ్డి నిజాయితీగా ఎన్నికలలో పాల్గొనాలి. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో కల్లోలం సృష్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇది మంచి పద్దతి కాదు. “ అని గుర్నాథ్ రెడ్డి అన్నారు.
పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే…
“కొడంగల్ లో ఓడిపోతానని తెలిసి ప్రాణహాని ఉందని రేవంత్ డ్రామాలు ఆడుతున్నారు. కొడంగల్ లో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అందరు అభ్యర్ధులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రాణహాని ఉందని ఇతర ప్రాణాలకు వెళ్లడం లేదని రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కొడంగల్ లో ఓటమి ఖాయమైందని తెలిసి చివరి ప్రయత్నంగా రేవంత్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.రేవంత్ డ్రామాలు చూసి కొడంగల్ ప్రజలు విసిగిపోయారు. 2009 లో రేవంత్ తన పై తానే దాడి చేసుకొని సానుభూతి డ్రామాతో గెలిచాడు. గత ఎన్నికల్లో చేసిన సానుభూతి డ్రామానే మళ్లీ పునరావృతం చేసి పబ్బం గడుపుకోవాలని రేవంత్ చూస్తున్నాడు.

రేవంత్ స్వభావాన్ని కొడంగల్ ప్రజలు గ్రహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని రేవంత్ ని ప్రజలు గ్రామాలలోకి రానివ్వటం లేదు. రేవంత్ కు సెక్యూరిటి ఉంది. ఆయన సెక్యూరిటిని ఇంకా పెంచినా కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. రేవంత్ మాటలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నమ్మడం లేదు. రేవంత్ బాధను తట్టుకోలేక కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి నేతలు చేరుతున్నారు. రేవంత్ పిచ్చి డ్రామాలు కట్టిపెడితే మంచిది. లేకపోతే ఆయన పరువు పోవడం ఖాయం. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరి ఎమ్మెల్యేలకు 3 కోట్ల నిధులు సీఎం ఇచ్చారు. నిధులు లేవని చెప్పి అభివృద్ది చేయక రేవంత్ నాటకాలు ఆడారు. ఇప్పటికైనా రేవంత్ తన డ్రామాలను కట్టిపెట్టి ప్రచారం చేసుకోవాలి. “ అని నరేందర్ రెడ్డి అన్నారు.
ఇదిలా ఉంటే కొడంగల్ లోని టిజెఎస్ నేతలు కూటమికి షాక్ నిస్తూ టిజెఎస్ కు రాజీనామా చేసి పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. వారు నరేందర్ రెడ్డితో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఆ వీడియో కింద ఉంది చూడండి.
