తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ తమతమ పనుల్లో మునిగి పోయాయి. నాయకులు తమదే అధికారమంటే తమదే అంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి అధికారం చేజిక్కిచ్చుకోవడానికి తహతహలాడుతున్నారు. ఎవరీ వ్యూహాల్లో వారున్నారు.బుధవారం నాడు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ మేనిఫేస్టో కమిటీ పలు కీలక పథకాలను ప్రతిపాదించింది. అవి ఏంటంటే…
- ఇళ్లు లేని కుటుంబాలకు రూ. 5లక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ. లక్ష అదనం.
- ఇందిరమ్మ ఇళ్లకు రూ. 2 లక్షలు, అదనంగా మరో గది.
- మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.
- కళ్యాణ లక్ష్మీతో పాటు బంగారు లక్ష్మీ కొనసాగింపు.
- దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రూ. 2 లక్షలు
- దివ్యాంగుల శాఖ విలీనం రద్దు
- ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచిత బీమా సదుపాయం
- తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, కుటుంబంలో ఉన్న ఒక్కో వ్యక్తికి 7 కిలోల బియ్యం, దళిత, గిరిజన కుటుంబాలకు ఉచితంగా రేషన్ బియ్యం, రేషన్ లో గతంలో మాదిరిగా అన్ని వస్తువులు అందజేత
- అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.3 వేల రూపాయల నిరుద్యోగ భృతి.
- వృద్దాప్య ఫించన్ల వయస్సు65 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గింపు, కుటుంబంలో ఎంత మంది వృద్దులున్నా సరే వారందరికి కూడా నెలకు ఒక్కోక్కరికి 2 వేల రూపాయలు, వికలాంగులకు నెలకు 3 వేల రూపాయల పించన్లు.
- అన్ని బిపిఎల్ కుటుంబాలకు సంవత్సరానికి 6 సిిలిండర్లు ఉచితంగా అందజేత
ఇప్పటి వరకు వీటిని ప్రతిపాదించిన కమిటీ ఎన్నికల నాటికి మరికొన్ని కీలక పథకాలను కూడా ప్రకటించి అందరిని ఆకట్టుకొని అధికారంలోకి రావడానికి సిద్దమైన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా జోష్ పెంచి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. నిరుద్యోగులను, మహిళలను లక్ష్యంగా పెట్టుకొని మరికొన్ని కీలక పథకాలు పెడతామని కీలక నేత తెలిపారు. 2