మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మునుగోడు జడ్పీటిసి జాజుల అంజయ్య గౌడ్, ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ యాదయ్య గౌడ్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. మంత్రి జగదీష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో కీలక నేతలు పార్టీ మార్పు కాంగ్రెస్ ను అయోమయంలో పడేసింది. మునుగోడులోని కిష్టాపురం గ్రామం జడ్పీటిసిది. ఆ గ్రామం కాంగ్రెస్ కు కంచుకోటగా కూడా ఉంది. రాజగోపాల్ రెడ్డి గెలుపులో జాజుల అంజయ్య కీలక పాత్ర పోషించారు. ఈ సమయంలో ఆయన పార్టీ వీడడంతో అందరిలో కలవరం మొదలైంది.
