ఆ విషయంలో కేసీఆర్ కు మంట : రాహూల్ గాంధీ

బైంసాలో జరుగుతున్న కాంగ్రెస్ బహిరంగసభలో కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీ మోడీ, కేసీఆర్ ల పై నిప్పులు చెరిగారు. సభ ప్రారంభంలో రాహూల్ గాంధీ కొమురంభీంను స్మరించుకున్నారు. కేసీఆర్ కు అంబేద్కర్ అంటే ఇష్టం లేదని దేశమంతా అంబేద్కర్ ను గుర్తు చేసుకుంటుంటే కేసీఆర్ మాత్రం ఏ ప్రాజెక్టుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదన్నారు.

కేసీఆర్ కుటుంబం రైతుల నుంచి అక్రమంగా భూములు లాక్కుందని, ప్రాజెక్టుల పేరుతో భారీ దోపీడి జరిగిందని రాహుల్ విమర్శించారు. భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారన్నారు. భూములు కోల్పోయిన రైతులు, గిరిజనులకు, దళితులకు సరిగా పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. రీ డిజైన్ల పేరుతో ప్రజా సొమ్ము వృథా చేస్తున్నారన్నారు. గిరిజనులు, ఆదివాసీలు, లంబాడీల కోసం యూపీఏ ప్రవేశ పెట్టిన పథకాలను కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శించారు.

దళితులకు 3ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ఇంటింటికి నీళ్లివ్వకుంటే ఓట్లు అడగమని చెప్పి ఇప్పుడేలా ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.