హరీష్ రావు తోక కత్తిరించేసాం… ఆయన బావ గారికి కూడా ముహూర్తం దగ్గర్లోనే ఉంది:రఘునందన్‌ రావు

raghunandana rao gave strong warning to trc party leaders at press meet

హైదరాబాద్‌: తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ సోమవారం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్’‌లో రఘునందన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే.. ఎంఐఎంకు ఓటు వేసినట్లే. హైదరాబాద్‌ను బెంగాల్, కోల్‌కతాగా మార్చవద్దని గ్రేటర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. పాతబస్తీలో జరుగుతోన్న అసాంఘిక కార్యక్రమాలను బయటకు తీస్తాం.బీజేపీ జాతీయ నాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందని, జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌ని ఎదుర్కొవడానికి బీజేపీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఎంఐఎంను మేయర్‌ పీఠంపై కూర్చోబెట్టడానికి కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కళ్ళు కిందకు దిగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాను .హరీష్ రావు తోక కత్తిరించేసాం… ఇక మిగిలి ఉంది ఆయన బావ కెసిఆర్, ఆయనకీ కూడా ముహూర్తం పెట్టామని అని ఆయన అన్నారు.

raghunandana rao gave strong warning to trc party leaders at press meet
raghunandana rao comments on trs party in monday press meet

‘వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్లు కొనుగోలుగా మార్చింది. జోనల్ కమిషనర్‌కు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసే అధికారం లేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ డ్రా చేసిన జోనల్ కమిషనర్లను కోర్టుకు ఈడ్చుతాం. టీఆర్ఎస్‌లో అవమానాలు ఎదుర్కొంటోన్నఅసలసిసలైన ఉద్యమకారులను బీజేపీ గౌరవిస్తోంది. టీఆర్ఎస్ పార్టీని ఓడింవచ్చన్న స్పూర్తిని దుబ్బాక ఇచ్చింది. బీజేపీని.. రఘునందనరావును వేరుచేసి చూడవద్దని మనవి చేస్తున్నాను. గద్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే కేసీఆర్ ముఖమంత్రి కాదు. సిద్ధిపేటతో సమానంగా కోట్లాడి దుబ్బాకకు నిధులు తీసుకెళ్తాను. గ్రామీణ ప్రాంతం కాబట్టే కేంద్ర నిధులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తాను. ఇకపై ప్రతి ఎన్నికలోనూ బీజేపీనే గెలిచేలా దుబ్బాకను అభివృద్ధి చేస్తాను. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం కోర్టులో స్వయంగా పోరాటం చేస్తాను. దుబ్బాక బస్టాండ్ నిధులను గోల్ మాల్ వ్యవహారం త్వరలో బయటకు వస్తుంది అన్నారు రఘునందన్‌ రావు.

BJP MLA Raghunandan Rao Fires On KCR & Harish Rao | Meet The Press | V6 News