ప్రగతి నివేదన సభ పై కిర్రాక్ సాంగ్ (వీడియో)

“తెలంగాణ ప్రగతి నివేదన సభ మతలాబేందయ్యా దొర… “అనే పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం నిరంకుషంగా వ్యవహారిస్తూ నియంత పాలన చేస్తున్నాడని ప్రగతి నివేదన సభను వ్యతిరేకిస్తూ ఆ కళాకారుడు తన పాట రూపంలో చాలా చక్కగా చెప్పాడు. ఆ పాట పాడింది ఎవరో కాదు ఉద్యమాల గడ్డ, పోరాటాలకు పుట్టినిల్లు అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన సుక్క రామనర్సింహ్మా.

సుక్క రామనర్సింహ్మా తెలుగురాజ్యంతో మాట్లాడి పలు విషయాలను తెలిపారు. పాటే తన సర్వసమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసి పల్లెపల్లెకు డప్పు సక్కన వేసుకొని పోయి తెలంగాణ యాతలు, బాధలు చెప్పినం… మన తెలంగాణ మనకు రావాలని పాటలు పాడినం. రాష్ట్రం అయితే వచ్చింది కానీ ప్రజల జీవితాలే బాగుపడలేదని నర్సింహ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సుక్క రామ నర్సింహ్మ పాడిన పాట కింద ఉంది చూడండి.

ఈ తెలంగాణ ప్రభుత్వం దొరల పాలన చేస్తుందని విమర్శించారు. కళాకారులకు ఉద్యోగాలిస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుండి తన పాటతో ప్రశ్నిస్తానని నర్సింహ్మా తెలుగురాజ్యంతో తెలిపారు.