కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ పై గద్దర్ వర్షన్ ఇదే

తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలిసే యోచనలో భాగంగానే రాహుల్ గాంధీని కలిశాను తప్ప అందులో ఇంకా ఏం లేదన్నారు. రాహుల్ గాంధీ తమ పార్టీలో చేరుతావా అని ప్రశ్నించారని తాను పుట్టినప్పటి నుంచి ప్రజల పార్టీలోనే ఉన్నానని అటువంటి ఆలోచనలేదని రాహుల్ కి చెప్పానని తెలిపానన్నారు. తాను ఏ పార్టీలో చేరలేదని, తాను ఏ పార్టీ సభ్యున్ని కాదని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు , ప్రజలు కోరుకుంటే కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ నుంచి పోటి చేస్తానన్నారు. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగానే తాను పోటి చేస్తానన్నారు. త్వరలోనే అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు అడుగుతానన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యకిరణ్ కు పార్టీ తరపున బెల్లంపల్లి సీటుతో పాటు మరో ఇద్దరు అనుచరులకు గద్దర్ సీటు కోరినట్టు తెలుస్తోంది.  శుక్రవారం సాయంత్రం 4.30 నిమిషాలకు గద్దర్ సోనియాను కలవనున్నారు.