కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై కేసు నమోదు

ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా దూషించినందుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది. నవంబర్ 29 న మహబూబాబాద్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు.  ఈ విషయమై టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును స్వీకరించి విచారణ జరిపిన రజత్ కుమార్ కేసు నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. ఈసీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ రిటర్నింగ్ అధికారి కొమురయ్య   రేవంత్ రెడ్డి  పై కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. పత్రికలు, న్యూస్ ఛానళ్లలో వచ్చిన ప్రసారాల ఆధారంగా కేసు నమోదు చేశారు. 17/జి, 504,181 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ కు విరుద్దంగా రేవంత్ మాట్లాడినట్టు విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం రేవంత్ పై కేసు నమోదు చేశామని రిటర్నింగ్ అధికారి తెలిపారు.