రా కేసీఆర్ చూసుకుందాం: డికె అరుణ

వనపర్తిలో జరిగిన సభలో డికె అరుణ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు డికె అరుణ ఘాటు గా స్పందించారు. తీవ్ర పదజాలంతో కేసీఆర్ పై డికె అరుణ ఫైర్ అయ్యారు. నీ పతనం ఖాయం… అంటూ దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు కాదు కేసీఆర్ నీవు పిచ్చోనివి. పాలమూరు జిల్లాకు ఏం ఒరగబెట్టినవయ్యా… ప్రాజెక్టుల నీళ్లు ఇయ్యవయ్యా అంటే నీళ్లు ఇవ్వలేదు. 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినని చెప్పుతున్నావు. సిగ్గుండాలే మాట మాట్లాడుతందుకు. కేసీఆర్ నీ బతుకు అయిపోయింది. నీవు గొంతు చించుకోని అరిచినా బట్టలు చించుకోని తిరిగినా జనాలు నమ్మరు. నీ పని అయిపోయింది పోయి ఇక ఫాం హౌస్ లో పండుకో కేసీఆర్ అని అరుణ ఫైర్ అయ్యారు. రారా కేసీఆర్ చూసుకుందాం.. నా బండారం బయటపెడతావు అంటూ విరుచుకుపడ్డారు.

నీ మంత్రులు, నాయకులు ప్రాజెక్టుల దగ్గర పండుకున్నారు. వారు ఏడ పండుకున్నారో తెలుసా.. నీకు నీవు సోయిలేకుండా ఫాం హౌజ్ లల్ల పంతే వాళ్లు తాము కట్టించిన గెస్ట్ హౌజ్ లల్ల పండుకుర్రు. చూడూ.. చరిత్ర తెలుసుకో.. ఝూటాకోర్.. దుబాయి శేఖర్ నీ పేరు… పాస్ పోర్టు దందాలు చేసి జనాలను మోసం చేసిన మోసాగాడివి నీవని డికె అరుణ అన్నారు. తప్ప తాగి సోయి లేకుండా పండుకున్నోనివి నీవు. నా ఒళ్లు నా దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నా. తాగి సోయి లేకుండా ఉన్నది నీవు కేసీఆర్… ఎస్ టిఆర్ ఎస్ నా కొడుకులు అన్నా.. ఇప్పుడు అంటున్నా … ఈ టిఆర్ ఎస్ నా కొడుకుల వల్లనే ఈ రాష్ట్రం నాశనమైంది. నీవు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నావు.

డికె అరుణ బండారం బయటపెడుతాంటావు… తన బండారం ఏందో నీ బండారం ఏందో చూసుకుందాం రా…రావయ్యా.. ఖబడ్డార్ కేసీఆర్.. జోగులాంబ తల్లి కోపానికి నీవు నాశనం అయితావు. ఓ మహిళను  పట్టుకొని అంటావు.. నాది పరువు కలిగిన కుటుంబంరా నాయనా నాది. నీవు ఏడి నుంచి వచ్చినవు. నీ చరిత్రను బట్టబయలు చేస్తాం.. పాలమూరు ప్రజలకు తెలుసు. నీ సంగతేందో… నా గురించా నీవు మాట్లాడేది. గద్వాలలో ఇంటింటికి తిరిగి చరిత్ర చెబుతాన్నవు..రా బిడ్డా తిరిగి చెప్పుదువు.

పాలమూరు ఎంపీగా ఉండి ఏం పీకినావు కేసీఆర్… మాయల పకీర్ వేషం వేసుకొని ప్రజలను మోసం చేసినవు. దొంగవు, పచ్చి మోసగాడివి నీవు. తెలంగాణ ఉద్యమం సమయంలో ముసుగు కప్పుకొని పండి పిల్లల ప్రాణాలు తీసిన హంతకుడివి, రాక్షసుడివి నీవు. తెలంగాణ ప్రజలు తప్పుదారి పట్టి నీకు ఓటు వేస్తే తెలంగాణల దొరతనం చేస్తున్నావు.. నీవు చెప్పినట్టు వినాల్నా.. నీవు అన్నట్టు పడాల్నా… ఖబడ్దార్ కేసీఆర్ అని అరుణ హెచ్చరించారు.

పూటకో మాట మారుస్తోడివి నీవు. టిడిపిల ఉంటే పూట గడవక బయటికి వచ్చినోడివి.  నీ లాగా వందల మందిని కూలీలు ఇచ్చి మందిని తేలేదు. తెలంగాణకు కేసీఆర్ నీవు చేసిందేం లేదు. మహిళలకు కేసీఆర్ ద్రోహం చేశారు. కత్తులు తిప్పినం… ఎస్ తెలంగాణ ఝూన్సీ లక్ష్మీభాయిలాగా పోరాడుతా… రఘువీరా రెడ్డికి మంగళహారతి పట్టిన అంటావు.. ఒక్క ఫోటో చూపించు నేను హారతి పట్టింది. జోగులాంబ తల్లి ఆగ్రహానికి మాడి మసై పోతావు కేసీఆర్. మహిళా శక్తితో నీవు నాశనం అవుతావు. కేసీఆర్ ను గద్దె దింపే వరకు నిద్ర పోమని తెలంగాణ ఆడబిడ్డలు కంకణం కంటుకున్నారు.

పదవులు శాశ్వతం కాదు. వాటిని చూసి మురిసిపోవద్దు. జోగులాంబ తల్లి సాక్షిగా ఆడపిల్లల తరపున శాపం పెడుతున్న… టిఆర్ ఎస్ పార్టీ నాశనమైతది… ఖబడ్దార్ కేసీఆర్ అంటూ డికె అరుణ హెచ్చరించారు.