కేసీఆరే ఓ పెద్ద బ్రోకర్ : కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి

కేసీఆర్ కాంగ్రెస్ నుండి పోటి చేస్తే నా సీటు వదిలేస్తానని కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరారు. తెలంగాణే రాకుంటే గజ్వేల్ ల ఎమ్మెల్యేగా కూడా కేసీఆర్ గెలిచేవాడు కాదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ కి రా.. ఒక్క రూపాయి ఎన్నికల్లో పెట్టకుండా ఎన్నికలకు పోదామని ఒట్ట వేసుకొని ఇక్కడి నుంచి కదులుదామని దానికి సిద్దమేనా కేసీఆర్ అని ఒంటేరు ప్రశ్నించారు.

కేసీఆర్ ఇచ్చిన హామీల మీద, అవినీతి మీద నేను ఎక్కడైనా చర్చకు సిద్దమని ఒంటేరు అన్నారు. కేసీఆర్ చర్చలకు రాకపోతే చవట, దద్దమ్మ అని ఒప్పుకున్నట్టే అని ఒంటేరు విమర్శించారు. తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆరే అని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన దగుల్బాజీ కేసీఆర్ అని, సాధారణ ఎన్నికలు వస్తే ఓడిపోతాననే భయంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాడన్నారు.

ఇంటింటికి నల్లా ఇస్తేనే ఎన్నికలల్లా ఓట్లు అడుగుతా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖంతో వెళ్తున్నారని, కేసీఆర్ నీకు నిజంగా చీము నెత్తురు ఉంటే, నువ్వసలు మనిషివైతే ఎన్నికలకు దూరంగా ఉండాలని ఒంటేరు అన్నారు. కేసీఆర్ ఒక గల్ప్ ఏజంట్ అని 2001 లో కేసీఆర్, హరీష్ రావుల ఆస్తులెన్ని ఇప్పుడెన్నో చెప్పాలని ఒంటేరు నిలదీశారు. ప్రగతి భవన్ లో బ్రోకర్లు ఉన్నారని అసలు బ్రోకరిజం పుట్టేందే కేసీఆర్ ఇంట్లో అని ఒంటేరు విరుచుకుపడ్డారు.

ఏపీ సీఎం ఉత్తర తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నాడని, కేసీఆర్   నువ్వు ఎప్పుడైనా ఉద్యమంల లాఠీ దెబ్బతిని జైలుకెళ్లావా అని ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించారు.