ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటి చేస్తామన్న భట్టి విక్రమార్క

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటి చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.  తమ సంఖ్యా బలం ప్రకారం తమకు ఒక ఎమ్మెల్సీ దక్కుతుందని సీఎం కేసీఆర్ ఏ విధంగా ఐదుగురి పేర్లను ప్రకటించారని ప్రశ్నించారు. డిప్యూటి స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కేటిఆర్ భట్టి విక్రమార్కను కోరారు. ఆ సమయంలో భట్టి ఈ విషయం పై కేటిఆర్ ను ప్రశ్నించగా ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కేసీఆర్ తో మాట్లాడి చెబుతానన్నారు.

దీంతో తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటి చేస్తామని భట్టి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎంపిక పై చర్చించనున్నారు. పార్టీ నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఫైనల్ చేయనున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక హాట్ హాట్ గా మారింది.