బ్రేకింగ్ న్యూస్… 5 ఎమ్మెల్సీ సీట్లు టిఆర్ఎస్ కైవసం

తెలంగాణ శాసనసభ కోటాలో జరిగిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించింది. టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఎన్నిక కాగా ఎంఐఎం నుంచి రియాజ్ ఎన్నికయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్ధిగా గూడూరు నారాయణ రెడ్డిని బరిలోకి దింపింది. కానీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియా నాయక్ లు టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. త్వరలోనే వారు అధికారికంగా కారెక్కనున్నారు. దీంతో తాము గెలవలేమని భావించిన కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. దీంతో 5 గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా గెలుపొందారు.