ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త డల్గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోకి మాజీ మంత్రి కొడాలి నాని తన తాజా ప్రెస్ మీట్తో ఒకేసారి వంద వోల్టుల కరెంట్ పాసయ్యేలా జోష్ తీసుకొచ్చాడు. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా లోకేష్ను టార్గెట్ చేస్తూ నాని విసిరిన పంచ్లు మరియు ‘కౌన్ కిస్కా గొట్టం’ లాంటి ఘాటు విమర్శలు సోషల్ మీడియాలో వైసీపీ కేడర్కు పండగ వాతావరణాన్ని తెచ్చాయి. గత రెండేళ్లుగా కూటమి అనుకూల మీడియా ఎంత ప్రచారం చేసినా, నానిని ఏమీ పీకలేకపోయారనే నిజాన్ని లైవ్ లోనే బట్టబయలు చేస్తూ.. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి,
నేను గుడివాడలోనే ఉంటా అని ఆయన విసిరిన ఓపెన్ ఛాలెంజ్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో, ఇప్పుడు విపక్షంలో ఉంటూ కూడా అదే రేంజ్ లో రెచ్చిపోవడంతో సోషల్ మీడియాలో వైసీపీ డిఫెన్స్ మోడ్ నుంచి ఒక్కసారిగా అటాకింగ్ మోడ్లోకి వచ్చేసింది. నాని దెబ్బకు కూటమి సోషల్ మీడియా వింగ్ మరియు తమ్ముళ్లు డిఫెన్స్లో పడిపోయారని, కేవలం ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో నాని నోటికి తాళం వేసే దమ్ము ఎవరికీ లేదని వైసీపీ శ్రేణులు కాలర్గెరేసి చెప్తున్నాయి.
మెగా డీఎస్సీ స్కామ్ అంటూ లోకేష్ చేస్తున్న ఆరోపణలను తుత్తునియలు చేస్తూ, చేతనైతే సీబీఐ విచారణ వేయించుకోవాలంటూ నాని ఇచ్చిన కౌంటర్లతో ప్రభుత్వం ఒక్కసారిగా ఖంగుతింది. వంశీ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంలోనూ కూటమి నేతల తప్పుడు లెక్కలను తనదైన మార్క్ వెటకారంతో తిప్పికొట్టడం విశేషం. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి సైన్యం ఇంకా తగ్గలేదని, తమను భయపెట్టాలని చూస్తే రివర్స్ లో మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో కౌంటర్లు ఉంటాయని కొడాలి నాని నిరూపించడంతో వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా జోష్ లో ఊగిపోతున్నాయి.