నానీని ఏం పీకలేరా..? తెలుగు తమ్ముళ్ళు ఫైర్..!

మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా ఓ సభలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ ‘కౌన్ కిస్కా గొట్టం’ అంటూ దారుణంగా విమర్శలు గుప్పించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ఫైర్ అవుతున్నారు. నాని అంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్నా కూటమి నేతలు మరియు సోషల్ మీడియా వింగ్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని, కేవలం మైకుల ముందు నీరసమైన ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారని తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గడిచిన రెండేళ్ల నుంచి సదరు నాయకుడు లోకేష్‌ను, చంద్రబాబును ఇష్టమొచ్చినట్లు తిడుతున్నా, కనీసం ఈ రెండేళ్లలో ఆయనను పట్టుకుని ఒక్కటి కూడా పీకలేకపోయారనే నిజం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సామాన్య నెటిజన్లకు సైతం నవ్వు తెప్పిస్తోంది. అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను గుడివాడలోనే ఉంటా అని నాని ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా, తమ్ముళ్లు మాత్రం ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేకపోతున్నారనే వెటకారం జోరుగా నడుస్తోంది.

నిజానికి గత రెండేళ్లుగా కొడాలి నానిపై రకరకాల కేసులు బుక్ చేయడం, లుకౌట్ నోటీసులు జారీ చేయడం లాంటివన్నీ జరిగాయని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా, ఆఖరికి ఆయన చుక్క కూడా ఊడబెకలేకపోయారనేది కాదనలేని వాస్తవమంటూ ప్రతిపక్ష శక్తులు కౌంటర్లు ఇస్తున్నాయి. ప్రభుత్వం మారినా, పవర్ చేతిలోకి వచ్చినా నాని నోటికి మాత్రం తాళం వేయలేకపోతున్నారని, ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలు డిఫెన్స్‌లో పడిపోవడం కూటమి సోషల్ మీడియాకు అలవాటుగా మారిపోయిందని విమర్శలు వస్తున్నాయి.

చేతనైతే కేసులను లాజికల్‌గా ముగించి చర్యలు తీసుకోవాలి కానీ, కేవలం మీడియాలో హడావుడి చేస్తూ కాలయాపన చేయడం వల్లే నాని మరింత రెచ్చిపోతున్నాడని సాక్షాత్తూ టీడీపీ అనుకూల వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి కొడాలి నానిని గత రెండేళ్లుగా ఏమీ పీకలేకపోయారనే నిజాన్ని కార్యకర్తలు సైతం అంగీకరిస్తూ, ఇప్పటికైనా సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు ఆపాలని తమ నాయకత్వాన్ని తిట్టుకోవడం ఈ తాజా ఎపిసోడ్‌లో అసలైన కామెడీగా నిలిచింది.