ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో మరోసారి పాత సీనే రిపీట్ అయింది. కూటమి ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ భేటీకి గైర్హాజరయ్యారు. అయితే ఈ డుమ్మా కొట్టడం ఆయనకు మొదటిసారో, రెండోసారో కాదు.. వరుసగా ఇది ‘ఐదో’ సారి కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో జరిగిన నాలుగు క్యాబినెట్ సమావేశాలను కూడా పక్కనబెట్టేసిన పవన్, ఈసారి కూడా ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాల వేళ సచివాలయం వైపు ముఖం చాటేయడంపై పొలిటికల్ సర్కిల్స్లో గట్టి వెటకారం నడుస్తోంది.
ఎప్పటిలాగే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గైర్హాజరుపై జనసేన పార్టీ నుండి ఒక ‘రెగ్యులర్’ ప్రెస్ నోట్ విడుదలైంది. “ఆరోగ్య కారణాల వల్లే” డిప్యూటీ సీఎం ఈ కీలక భేటీకి రాలేకపోయారంటూ పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అయితే, నిత్యం సినిమాల్లోనూ, బయట పొలిటికల్ మీటింగుల్లోనూ విపరీతమైన ఎనర్జీతో కనిపించే పవన్ కళ్యాణ్కు.. కరెక్ట్గా చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టే రోజునే ఎందుకు ‘అనారోగ్యం’ గుర్తొస్తుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. ప్రతిసారీ ఇదే సాకు చెబితే జనాలు నమ్మే రోజులు పోయాయని, అసలు కూటమిలో చంద్రబాబు, లోకేష్ల దూకుడు నచ్చకే పవన్ ఇలా సైలెంట్గా తన నిరసనను వ్యక్తం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ప్రభుత్వంలో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా నారా లోకేష్ ‘సకల శాఖా మంత్రి’లా సర్వత్రా తానే అయి వ్యవహరిస్తుండటంతో.. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్కు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ నడుస్తోంది. అక్టోబర్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, పాలనాపరమైన కీలక ఫైళ్లపై చంద్రబాబు ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని, అందుకే పవన్ వరుసగా ఐదు మీటింగులకు రాకుండా ‘సైలెంట్ సమ్మె’ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఒకవైపు హోదా ప్రకారం డిప్యూటీ సీఎం అని పిలిపించుకుంటూ, కీలకమైన నిర్ణయాల మీటింగులకు మాత్రం ఇలా ఐదుసార్లు డుమ్మా కొట్టడం చూస్తుంటే.. కూటమి కాపురం పైన పటారం లోన లొటారంలా ఉందంటూ విపక్షాలు వెటకారంగా కామెంట్లు పెడుతున్నాయి.