Pushpa : ఈ ఏడాది ఒక్క టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరే కాకుండా ఇండియా బాక్సాఫీస్ దగ్గర వచ్చిన భారీ సినిమాల్లో ఒకటి “పుష్ప పార్ట్ 1”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ఇది. లాస్ట్ మినిట్ లో కొన్ని హర్డెల్స్ వచ్చినా రిలీజ్ అయ్యాక మాత్రం పుష్ప రాజ్ ప్రభంజనం ఓ రేంజ్ లో మోగింది.
అయితే ఇప్పుడు పుష్ప కి వస్తున్న వసూల్లే మళ్లీ టాలీవుడ్ లో పెద్ద సమస్య గా మారుతాయా అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సినిమా బాగుంది వసూళ్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. లేటెస్ట్ గా 170 కోట్ల మార్క్ ని ఈ చిత్రం దాటినట్టుగా స్వయంగా చిత్ర బృందమే ప్రకటించింది. అయితే ఈ అధికారిక లెక్కలే ఏపీ ప్రభుత్వం కి బాగా దొరికినట్లు అవుతుంది.
దీనితో ఇంత వసూళ్లు వస్తున్నాయి. టాలీవుడ్ కి ఏమీ డోకా లేదని ఇంకా టాక్స్ లు పెద్ద ఎత్తున కట్టమని కోతలు విధిస్తారని అప్పుడు మళ్లీ మొదటికే మోసం వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి పుష్ప యూనిట్ అయితే ఇప్పుడప్పుడే ఈ పోస్టర్ ల గోల ఆపేలా లేరు మరి ఫైనల్ గా ఏం జరుగుతోంది అనేది చూడాలి.
