Virataparvam Release : రానా – సాయి పల్లవి: ‘విరాటపర్వం’ ఏమైంది.?

Virataparvam Release : దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘విరాట పర్వం’ సినిమా ఎప్పుడో విడుదల కావల్సి వుంది. కరోనా టైమ్‌లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నారు. అప్పట్లో సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలూ, టీజర్లు తప్ప, ఇంతవరకూ ఈ సీనిమాకి సంబంధించి మరే ఇతర అప్‌డేట్ లేదింతవరకూ.

అసలింతకీ ‘విరాటపర్వం’ ఏమైంది.? సినిమా షూటింగ్ అయినా పూర్తయ్యిందా.? లేదా.? ఇప్పట్లో రాలేవనుకున్న ‘లవ్ స్టోరీ’, శ్యామ్ సింఘరాయ్..’ వంటి రెండు సినిమాలు సాయి పల్లవి నుంచి వచ్చేశాయ్. కానీ, ఎప్పుడో పూర్తయిపోయిందనుకున్న ‘విరాటపర్వం’ ఎందుకు ఊసులో లేదు.. అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమాలు సైతం షూటింగులు పూర్తి చేసుకుని, హర్రీ బర్రీగా రిలీజ్ డేట్లు సిద్ధం చేసుకుని, ఒక్కొక్కటిగా విడుదలయిపోతున్నాయి. అలాంటిది ‘విరాటపర్వం’ విషయంలో ఈ జాప్యమెందుకో అర్ధం కావడం లేదు.

మొన్నామధ్య డైరెక్ట్ ఓటీటీకి ‘విరాటపర్వం’ ఇచ్చేసే యోచనలో వున్నారు నిర్మాతలు.. అంటూ వార్తలొచ్చాయి. కానీ, అదీ జరగలేదు. కరోనా బేస్ చేసుకుని, వెంకటేష్ నటించిన రెండు సినిమాలు ‘నారప్ప’, ‘దృశ్యం 2’ సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసి మమ అనిపించేశారు.

అలాంటిది ‘విరాటపర్వం’ ని ఎందుకు పట్టించుకోవడం లేదో. తెలియాల్సి వుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రియమణి, నివేదా పేతురాజ్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.