నాన్ స్టాప్ గా “వీరసింహా రెడ్డి”.. లేటెస్ట్ డీటెయిల్స్ ఏమిటంటే.!

నటసింహ నందమూరి బాలయ్య హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన లేటెస్ట్ భారీ ఏక్షన్ చిత్రం “వీరసింహా రెడ్డి”. అఖండ లాంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా ఇది కావడం పైగా పోస్టర్ లు మరియు టీజర్ కూడా మాస్ రెస్పాన్స్ కొల్లగొట్టడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు స్టార్ట్ అయ్యాయి.

ఇక ఈ చిత్రం రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తుండగా ఈ గ్యాప్ లో చిత్ర బృందం షూటింగ్ అయితే నాన్ స్టాప్ గా చేస్తున్నారు. మరి ఈ షూటింగ్ డీటెయిల్స్ ఇప్పుడు బయటకి వచ్చాయి. మరి రేపు నవంబర్ 9 నుంచి అనంతపూర్ జిల్లా లో 13వ తేదీ వరకు నాన్ స్టాప్ గా సినిమా షూటింగ్ జరగనుండగా.

9న లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో జరగనుండగా 10 మరియు 11 తేదీల్లో ఉరవకొండ రాకెట్ల ప్రాంతాల్లో జరగనున్నాయి. ఇక 12, 13 న అయితే పెనుగొండలో వరుస గా నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ కానుంది.

ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే దునియా విజయ్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మేకర్స్ ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. 
https://twitter.com/rameshlaus/status/1589827809815719936