కేసీఆర్ డౌన్ డౌన్.. కిషన్ రెడ్డి జిందాబాద్.. అంటూ టీఆర్ఎస్ కార్యకర్తల జేజేలు? కేసీఆర్ షాక్?

trs activists hail kishan reddy, down down cm kcr

అదేంటి… టీఆర్ఎస్ కార్యకర్తలు అలా ఎందుకు చేశారు? అంటారా? అదేంటో తెలియాలంటే వార్త పూర్తిగా చదవాల్సిందే మీరు. నిన్న భారత్ బంద్ జరిగింది కదా. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులంతా నిన్న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతులకు సంఘీబావం ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా నిన్న బంద్ లో పాల్గొన్నారు.

కేసీఆర్ డౌన్ డౌన్.. కిషన్ రెడ్డి జిందాబాద్
trs activists hail kishan reddy, down down cm kcr

అక్కడే ఓ విచిత్రం చోటు చేసుకుంది. భారత్ బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరికే ఊరుకోరు కదా. తమ పార్టీని పైకి లేపడం కోసమో.. కేసీఆర్ మెప్పు కోసమో ఏదో ఒకటి చేద్దామనుకొని ఏదో చేసేశారు.

కొందరు కార్యకర్తలు సీఎం కేసీఆర్ కు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిక జేజేలు కొట్టారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు దెబ్బకు షాక్ అయ్యారు.

కేసీఆర్ డౌన్ డౌన్… కిషన్ రెడ్డి జిందాబాద్ అంటూ వాళ్లు చాలాసేపు నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేసీఆర్ డౌన్ డౌన్.. కిషన్ రెడ్డి జిందాబాద్

అయితే.. వాళ్లు టీఆర్ఎస్ కార్యకర్తలే కానీ.. ఫుల్లుగా మద్యం తాగి వచ్చి ఏం చేస్తున్నారో తెలియక.. అలా కేసీఆర్ డౌన్ డౌన్.. కిషన్ రెడ్డి జిందాబాద్ అని నినాదాలు చేశారట. జస్ట్ రివర్స్ లో చెప్పాల్సింది.. అంటే కిషన్ రెడ్డి డౌన్ డౌన్.. కేసీఆర్ జిందాబాద్.. దాన్ని ఉల్టా చెప్పారు.. అడ్డంగా బుక్కయ్యారు.

అందరి ముందు సీఎం కేసీఆర్ పరువు తీయడం.. ఆ వీడియో వైరల్ కావడంతో.. ఈ విషయం సీఎం కేసీఆర్ దాకా వెళ్లిందట. కేసీఆర్ ఈ విషయంపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఏమో… దీనిపై ఎటువంటి చర్యలు ఉంటాయో వేచి చూడాల్సిందే?