
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు కీలక పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. మళయాళ హిట్ చిత్రం అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా దీనిని దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు.
మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ సన్నివేశం షూటింగ్ జరిగుతుందని తెలుస్తోంది. అది కూడా అదిరే లెవెల్లో ఉండే ఇంటర్వెల్ బ్లాక్ లోని సీన్ అట. అయితే ఇది సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఛేజింగ్ సీక్వెన్స్ అన్నట్టు తెలుస్తుంది. ఈ సన్నివేశం పవన్ మరియు రానా ఇద్దరు మధ్య కూడా ఉండబోతుందట. అయితే ఈ ఇది కార్ ఛేజింగ్ సీన్ నా లేక బైక్ పై ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
