NBK : తగ్గేదే లే: బాబు బాటలో బాలయ్య ఏడుపు.!

balakrishna telugu rajyam

NBK : మొన్న నారా చంద్రబాబు నాయుడు ఏడ్చారు.. ఇప్పుడేమో నందమూరి బాలకృష్ణకి ఏడుపొస్తోంది. అరరె, బాలయ్యకు ఎంత కష్టమొచ్చింది.? అసలు విషయమేంటంటే, నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆహా ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో ఈ వింత పరిణామం చోటు చేసుకుంది.

స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారు. ఇదేదో గిట్టనివారు చేసే దుష్ప్రచారం కానే కాదు. స్వయంగా ఆ వెన్నుపోటుకి బాధితుడైన ఎన్టీయార్ వ్యక్తం చేసిన ఆవేదన. తనను చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచిందీ చెప్పుకుని స్వర్గీయ ఎన్టీయార్ ఏడ్చారు. అప్పట్లో ఎన్టీయార్ ఏడుపుని కూడా ‘నాటకం’గా అభివర్ణించారు చంద్రబాబు అండ్ కో.

ఆ సమయంలో తండ్రికి అండగా వుండాల్సిన కొడుకు బాలయ్య, అనూహ్యంగా చంద్రబాబు వెంట నడవడం స్వర్గీయ ఎన్టీయార్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఆనాటి ఆ పరిస్థితుల గురించి ప్రస్తావన తాజాగా వస్తే, ‘ఆహా’ వేదికగా ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలో బాలయ్య తనకు ఏడుపొస్తోందని అన్నారు. అది వెన్నుపోటు కాదు, ఆ పేరుతో జరిగిన దుష్ప్రచారం.. అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

వెన్నుపోటు కాక మరేమిటి.? అని ఆనాడు స్వర్గీయ ఎన్టీయార్ ఆవేదన చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ప్రశ్నిస్తుంటారు. సరే, లక్ష్మీపార్వతి రాకతో స్వర్గీయ ఎన్టీయార్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.? అన్నది వేరే చర్చ. కానీ, తండ్రి కష్టంలో వున్నప్పుడు కొడుకు.. అండగా వుండాలి కదా.?

నందమూరి హరికృష్ణ అప్పట్లో చంద్రబాబుకి ఎదురు తిరిగారు. కానీ, చంద్రబాబుతో పోరాడే శక్తి లేక, చేతులెత్తేశారు.. చివరికి చంద్రబాబు పంచన హరికృష్ణ కూడా చేరాల్సి వచ్చింది. టీడీపీ అత్యంత దారుణంగా పతనమవుతున్నా, స్వర్గీయ ఎన్టీయార్ తనయుడిగా బాలకృష్ణ, పార్టీని బాగు చేసేందుకు ప్రయత్నించలేకపోతున్నారు.