Raashi Khanna To Get Shock : రాశీఖన్నాని తెలుగు ఆడియన్స్ ఇక మర్చిపోవడమేనా.? తెలుగు మేకర్లు ఇకపై రాశీఖన్నాకు అవకాశాలివ్వరా.? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయ్. అసలెందుకిదంతా.? అంటే ఈ మధ్య రాశీఖన్నా బాలీవుడ్ హవా కాస్త పెరిగిన సంగతి తెలిసిందే.
కొన్ని బాలీవుడ్ సినిమాలతో పాటు, ప్రముఖ వెబ్ సిరీస్లలోనూ నటిస్తోంది రాశీఖన్నా. రీసెంట్గా ఓటీటీలో స్ర్టీమ్ అవుతున్న’రుద్ర’ వెబ్ సిరీస్ రాశీఖన్నాకి కొంత నెగిటివిటీని, మరికొంత పాజిటివిటీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే నెగిటివ్గా కామెంట్ చేసిన నెటిజన్లకు కౌంటర్ ఇచ్చే క్రమంలో రాశీఖన్నా కాస్త హద్దులు దాటి నోరు జారేసింది.
పాపం అనుకోకుండానే జరిగిందో ఏమో కానీ, అడ్డంగా బుక్కయిపోయింది రాశీఖన్నా. సౌత్లో టాలెంట్ కన్నా, గ్లామర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చేసింది. ఆ రివర్స్ కౌంటర్ రాశీఖన్నాకే తిరిగి కొట్టేసింది. నెటిజన్లతో పెట్టుకుంటే అంతే.. మావులుగా వుండదు మరి.
ఇక రాశీఖన్నాని లైట్ తీసుకోవల్సిందే.. అంటూ మేకర్స్పై ఒత్తిడి తెస్తున్నారట. టాలీవుడ్తో నీకేం పని చెక్కేయ్.. అంటూ సోషల్ మీడియాలో రాశీఖన్నాపై గట్టిగా ట్రోలింగ్ జరుగుతోంది. మరి, ఈ ముద్దుగుమ్మ ఈ యవ్వారాన్ని ఎలా చక్కదిద్దుకోనుందో. టాలీవుడ్లో తన కెరీర్ని ఎలా నిలబెట్టుకుంటుందో.!
ప్రస్తుతం రాశీఖన్నా తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్యతో ‘థాంక్యూ’ సినిమాల్లో నటిస్తోంది.