పవన్ నియోజకవర్గంపై పూనమ్ హాట్ ట్వీట్..ఎందుకో చూడండి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నుంచీ పొలిటికల్ గా మీడియాలో అతనిపై టార్గెట్స్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. అదే క్రమంలో పవన్ పర్సనల్ లైఫ్ పరంగా కూడా అనేకమంది ఎన్నో కామెంట్స్ చేశారు అయినా పవన్ ఎప్పుడూ పట్టించుకోలేదు.

అయితే నటి పూనమ్ కౌర్ పై పవన్ కి లింక్ పెట్టి కూడా పలు ట్రోల్స్ ఇప్పటికీ నడుస్తాయి. అదే విధంగా పూనమ్ వైఖరి కూడా ఒకోసారి అర్థం కాకుండానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తాను పెట్టిన తాజా ట్వీట్ తో మాత్రం పూనమ్ పవన్ వైపే ఉందా అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. అంతర్జాతీయ సంస్థ ఒక సర్వే ని రిలీజ్ చేసింది.

ఏ రాష్ట్రంలో సిట్టింగ్ నేతలు ఆ పార్టీల పట్ల అసంతృప్తి గా ఉన్నారు అనే దానిపై పెట్టగా అందులో ఏపీ కి కూడా గట్టిగానే ఉంది. మరి దీనికే పూనమ్ పవన్ పోటీ చేసిన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని టాగ్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. అయితే పూనమ్ ఏ కోణంలో టాగ్ చేసిందో కానీ ఈ ట్వీట్ తో ప్రతి ఒక్కరికీ క్లారిటీ వచ్చినట్టేగా అని పవన్ అభిమానులు అంటున్నారు.