Moorkhudu Nara Lokesh : పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ‘నేను పప్పుని కాదు.. ఐ యామ్ హీరో..’ అంటూ చెలరేగిపోయారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
సమయం లేదు మిత్రమా, వీలైతే ఓ డజను కేసులు పెట్టించుకునేలా పోరాడండి.. అంటూ పిలుపునిచ్చేశారు కూడా. ఇదెక్కడి వింత.? అంటే, ‘ఎన్టీయార్ దేవుడు.. చంద్రబాబు రాముడు.. నేను మూర్ఖుడ్ని..’ (Moorkhudu Nara Lokesh ) అంటూ చిత్ర విచిత్రమైన వాదనని తెరపైకి తెచ్చారు నారా లోకేష్.
‘ఔను, నువ్వు మూర్ఖుడివే. లేకపోతే, డజను కేసులుంటే తప్ప పార్టీ కోసం పని చేసినట్టు కాదంటావా.?’ అంటూ టీడీపీలోనే కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా అసహనం వ్యక్తం చేస్తున్నారట. అధికార వైసీపీ నుంచి ‘మూర్ఖుడు లోకేష్’ అంటూ పడుతున్న సెటైర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇదే, ఇలాంటి అసహనం వల్లనే టీడీపీకి నారా లోకేష్ వల్ల మరింత చెడ్డపేరు వస్తోంది తప్ప, ఆయన వల్ల వీసమెత్తు ప్రయోజనం కూడా పార్టీకి వుండడంలేదన్నది సీనియర్ల వాదన.
‘కేవలం నారా లోకేష్ వల్లనే పార్టీ ఇలా నాశనమైపోయింది..’ అంటూ చాలామంది నేతలు నారా లోకేష్ మీద ఆరోపణలు చేస్తూ గతంలో పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత మంది సీనియర్లు పార్టీకి దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం, ‘కేసుల గోలేంటి.? మూర్ఖుడినంటూ సొంత డబ్బా కొట్టుకోవడమేంటి.?’ అంటూ చినబాబుకి క్లాస్ తీసుకున్నారట. పుత్రరత్నం రోజురోజుకీ పార్టీ ప్రతిష్టని దిగజార్చేలా వ్యవహరిస్తున్న వైనాన్ని చూసి చంద్రబాబు కంటి మీద కునుకు వుండదని ప్రత్యేకంగా చెప్పాలా.?
పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో పార్టీ శ్రేణులకు చక్కని సందేశం ఇవ్వాలి.. అదే సమయంలో ప్రజలూ పార్టీ గురించి ఆలోచించేలా చెయ్యాలి.. కానీ, ప్రజలు పార్టీని ఛీత్కరించేలా చేయడమేంటి.? అన్న కనీసపాటి విజ్యతని లోకేష్ విస్మరించడం హాస్యాస్పదం కాక మరేమిటి.?