రెండు చోట్లా ఓడిన దత్త పుత్రుడు: మళ్ళీ కెలికిన మంత్రి అంబటి.!

Minister Ambati : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సీబీఎన్ దత్త పుత్రుడు’ అంటూ సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ‘మమ్మల్ని సీబీఎన్ దత్త పుత్రుడిగా అభివర్ణిస్తే, మిమ్మల్ని సీబీఐ దత్త పుత్రుడు అనాల్సి వస్తుంది..’ అంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒకటికి రెండు సార్లు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు, ఆ తర్వాత స్ట్రాంగ్ కౌంటర్ ఎటాక్ కూడా మొదలు పెట్టారు.

సోషల్ మీడియా వేదికగా ‘సీబీఐ దత్త పుత్రుడు.. రాజన్న చెత్త పుత్రుడు.. చంచల్ గూడా జైలు బ్యాచ్..’ అంటూ జనసేన శ్రేణులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వేస్తున్న సెటైర్లను చూస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా విభాగంతో పోల్చితే, జనసేన సోషల్ మీడియా మద్దతుదారుల పవర్ చాలా చాలా ఎక్కువ.

అవసరమా ఇదంతా.? అంటే, వైసీపీకి అదో ఆనందం. ఇక, తాజాగా మంత్రి అంబటి రాంబాబు ‘రెండు చోట్లా దత్త పుత్రుడ్ని ఓడించారు..’ అంటూ పవన్ కళ్యాణ్ మీద సెటైర్లేసి, వివాదాన్ని మళ్ళీ కెలికారు. ఇంకేముంది.? ‘అంబోతు రాంబాబు.. ర్యాంబో కాంబాబు..’ అంటూ మంత్రి అంబటి మీద సోషల్ మీడియాలో జనసేన మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు.

నిజమే, జనసేన అధినేత రెండు చోట్ల ఓడిపోయారు. ఓడిపోవడం నేరమైతే, 2014 ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోవడాన్ని ఏమనాలి.? అన్న ప్రశ్న సహజంగానే జనసేన శ్రేణుల నుంచి వినిపిస్తుంటుంది. ఇక, గతంలో అంబటి రాంబాబుకి సంబంధించి విడుదలైన ఆడియో టేపులు ఇంకోసారి వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి, నిజాలు నిగ్గు తేల్చుతానని బీరాలు పలికిన అంబటి రాంబాబు, మంత్రి అయ్యాక కూడా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడమేంటో.!