
మెగా వృక్షం నుంచి వచ్చిన ఎందరో యువ హీరోల్లో తమకంటూ మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్న యంగ్ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. ఒక్క నటనతోనే కాకుండా తన మవయ్యల నుంచి సేవాగుణం కూడా పుణికిపుచుకున్నాడు సాయి తేజ్.. అయితే ఇటీవల సాయి తేజ్ కి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ ఘటన కూడా ఎన్నో కోణాలు కూడా తీస్కుంది.
మరి ప్రమాదం జరిగి కొన్ని రోజులు వరకు తేజ్ ఆరోగ్యం బాగుంది కుదుట పడుతుంది అని అధికారిక ప్రకటనలు అయితే వచ్చాయి కానీ నిజానికి మాత్రం తేజ్ కి కాస్త సీరియస్ గానే ఉందేమో అనిపిస్తుంది అని చెప్పాలి. తన లేటెస్ట్ చిత్రం ‘రిపబ్లిక్’ ఈవెంట్ లో పవన్ ఆవేశంలో ప్రస్తుత సాయి తేజ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పేసారు.
అభిమానులు, సానుభూతిపరులు కంగారువు పడతారు అనేమో కానీ తేజ్ కోలుకుంటున్నాడు అని చెప్పారు కానీ ప్రస్తుతానికి తేజ్ కోమాలోనే ఉన్నట్టు అని చెప్పాలి. అంతగా రికవర్ అయ్యినట్టు అయితే ఈపాటికే తాను కనీసం మాట్లాడిన బైట్ వచ్చి ఉండాలి. దీనిని బట్టి అతడికి ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలోనే ప్రమాదానికి గురి అయ్యి ఉండొచ్చు.. ఏది ఏమైనప్పటికీ మాత్రం సాయి తేజ్ మళ్లీ త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆకాంక్షిద్దాం..
