Y.S.Jagan: వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 లో తిరిగి తన పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. ఇప్పటినుంచి ఈయన సరికొత్త ప్రణాళికలను రచిస్తూ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేస్తూ ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇలా సింగిల్ గా పోటీ చేసి ఈ స్థాయిలో మెజారిటీ సాధించిన జగన్ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు అయితే ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాలపై పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్న జగన్ తన తప్పులను సరి చేస్తూ వస్తున్నారనే చెప్పాలి. ఇప్పటికే పార్టీలో సీనియర్ నాయకులకు పెద్దపీట వేయటమే కాకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
ఇక పార్టీ గ్రౌండ్ లెవెల్ లో బలంగా ఉండాలి అంటే కార్యకర్తలే ముఖ్యమని తెలుసుకున్న జగన్ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్నారు. ఇకపై ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాన్ని కార్యకర్తల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఇకపై పార్టీ క్యాడర్ కోసం.. రోజుకు గంట లేదా రెండు గంటలు… కేటాయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. వాళ్లతో మాట్లాడిన తర్వాతే తదుపరి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయటం వల్ల గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ బయటపడుతుందని జగన్ భావించినట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రతి గడప గడప తిరగాలని అనుకుంటున్నారు. అలా చేస్తే మళ్లీ 2029లో వైసీపీ జెండా ఎగురవేయడం గ్యారంటీ అనుకుంటున్నారు.