Prabhas : ఇన్సైడ్ టాక్స్ : జగన్ తో మీట్ కి ప్రభాస్ డుమ్మా..కారణం ఇదేనట.!

Prabhas : మళ్ళీ టాలీవుడ్ లో కొన్ని కీలక పరిణామాలకు సమయం ఆసన్నం అయ్యింది. గత కొన్నాళ్ల కితం నుంచి టాలీవుడ్ ని ఏపీలో వేధిస్తున్న కీలక అంశం సినిమా టికెట్ ధరల అంశం. ఇది మాత్రం మన స్టార్ హీరోల సినిమాలకు గాను తీరని తలనొప్పిలా మారింది. ఎన్ని చర్చలు కీలక సమావేశాలు జరిగినా లాభం లేకపోయింది.

కానీ గత కొన్ని రోజులు కితం మెగాస్టార్ చిరంజీవి ని ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ జగన్ పిలిచి ఈ కీలక అంశంపై చర్చించారు. ఆ తర్వాత చిరు చెప్పిన మాటలు కాస్త ఊరటనిచ్చాయి. ఇక ఇప్పుడు మళ్ళీ చిరు సహా మరికొంత మంది కీలక స్టార్ హీరోలు జగన్ తో మీట్ కి గాను వెళ్లనున్నట్టుగా సినీ వర్గాల్లో ఇప్పుడు విస్తృతంగా టాక్ వినిపిస్తుంది.

మరి ఈ స్టార్ హీరోలలో మొదట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వస్తున్నాడని మొదట వినిపించగా ఇప్పుడు అయితే ప్రభాస్ తాను రావడానికి సిద్ధంగా లేదని జగన్ తో మీట్ కి ఆసక్తి కనబరచడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి దీనికి కారణం కూడా ఒకటి వినిపిస్తుంది.

ప్రభాస్ కి కొంచెం వెన్ను నొప్పి ఉండడం వల్ల రావడానికి కుదరని చెప్పాడట. దీనితో ప్రభాస్ ఈ మీట్ కి డుమ్మా కొట్టేసినట్టు కన్ఫర్మ్ అయ్యిందని సినీ వర్గాల్లో టాక్. కానీ మరోపక్క ప్రభాస్ కి అయితే నిజంగానే కలిసేందుకు ఆసక్తి లేకనే వెళ్లడం లేదని ఇంకో ఇన్సైడ్ టాక్.