నా సోదరుడు వైఎస్ జగన్ తో గొప్ప సమావేశం జరిగింది అంట కేటీఆర్ ట్వీట్..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వైయస్ జగన్ కార్యక్రమాలలో సమావేశం అవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం తో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ పెట్టుబడుల ఆహ్వాన విషయంలో అక్కడి పర్యటనలో బిజీగా ఉన్నాడు. ఇక ఇద్దరు అనుకోకుండా కలవడంతో వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా తన సోదరుడు ఏపీ సీఎం వైయస్ జగన్ గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ ట్వీట్ చేశాడు.