Y.S.Jagan: ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగగా ఏడు చోట్ల ఎన్నికల వాయిదా పడటంతో మిగిలిన 50 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో 39 స్థానాలలో వైసిపి విజయ్ కేతనం ఎగరవేసింది ఇలా ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పాలి. ఇలా స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో వైసిపి విజయ్ కేతనం ఎగరవేయడంపై వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఈ సందర్భంగా జగన్ స్థానిక సంస్థలపై ఎన్నికల గురించి ట్వీట్ చేస్తూ…స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, సీఎం చంద్రబాబు నాయుడు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు.వైసీపీ నేతలపై కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టారని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారని తెలిపారు.
విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. అంతేగాక క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందించారు. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు ఇలా ప్రతి ఒక్కరికి హ్యాట్సాఫ్ అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.