AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో కూటమి సర్కార్ ఏపీ మహిళలకు శుభవార్తను తెలియజేస్తోంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో పెద్ద ఎత్తున వరాల జల్లులు కురిపించారు. కానీ ఇప్పటివరకు ఏదీ కూడా ప్రజలకు సరైన విధంగా అమలు చేయలేదని దీంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ అమలులో పూర్తి నిరాశ వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే కూటమి సర్కార్ ఏర్పాటు ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మహిళలకు ఊహించని విధంగా బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతి 18 సంవత్సరాలు కలిగిన మహిళల ఖాతాలో ప్రతినెల 1500 జమ చేస్తామని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి ఆకర్షతులైన ఎంతో మంది మహిళలు కూటమివైపే మొగ్గు చూపుతూ కూటమికి ఓట్లు వేశారు. అయితే కూటమి సర్కార్ ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో ఈ పథకం కోసం మహిళలందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ తరుణంలోనే ఏడాది కూటమిపాలన పూర్తి సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కూడా భారీ స్థాయిలో షరతులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు మాత్రమేనని అగ్రవర్ణ మహిళలకు ఈ పథకం వర్తించదని తెలిపారు. అదే విధంగా ప్రతి ఏడాది వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ పథకం అమలుకు ఎన్ని విధాలుగా ఫిల్టర్ చేసిన భారీ స్థాయిలో మహిళలు అర్హులు కానున్నారు. మొత్తానికి కూటమి సర్కార్ తొలి ఏడాది బాబు ఇచ్చే మెగా గిఫ్ట్ ఓన్లీ ఫర్ లేడీస్ గా ఉందనే చెప్పాలి.