Skip to content
TeluguRajyam Logo
  • హోమ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
  • తెలంగాణ‌
  • సినిమా
  • మూవీ రివ్యూ
  • గాసిప్స్
  • ప్రత్యేకం
  • లైప్‌స్టైల్‌
  • ఫొటోస్
  • ఇంగ్లీష్

Home » Montha Cyclone: రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్.. నీట మునిగిన వరి పొలాలు..!

Montha Cyclone: రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్.. నీట మునిగిన వరి పొలాలు..!

By Pallavi Sharma on October 29, 2025

ఏపీలో తుపాను తుపాన్‌ తాకిడికి రైతుల కలలన్నీ నీటిలో కలిసిపోయాయి. ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, కుండపోత వర్షాలు వరి పొలాలను ముంచెత్తాయి. ముఖ్యంగా బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి పరిసరాల్లో వేల ఎకరాల వరి పంట నేలమట్టమైంది. కంకుల దశకు వచ్చిన వరి మొక్కలు నీటిలో తేలుతూ ఉండగా, రైతుల కళ్లలో కన్నీటి ధారలు పారుతున్నాయి.

ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే పోతుంటే గుండె పగలక మానదు అంటున్నారు రైతులు. ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల వరకు నష్టం జరిగిందని వారు వాపోతున్నారు. ముందుగా 40 బస్తాలు దిగుబడి రావాల్సిన పొలాలు ఇప్పుడు 10 నుండి 15 బస్తాలకు కూడా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. నీరు నిల్వ ఉండిపోవడం.. ఇసుక పేరుకు పోవడంతో భవిష్యత్ పంటలకు కూడా ముప్పు ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.

తుఫాన్‌ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై కూడా తీవ్రంగా పడింది. గోదావరి పరీవాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక గ్రామాల్లో రవాణా స్తంభించింది. వరి పంటలు, వేపపంటలు, కూరగాయల సాగులు నాశనమై రైతులు కంగారుపడుతున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇక పంట నష్టాన్ని అంచనా వేయడానికి డ్రోన్ల సాయాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు.
మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 15కి పైగా మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా, పశువుల మరణాలు కూడా నమోదయ్యాయి. వర్షాల తీవ్రత తగ్గినా, నీటిమట్టం ఇంకా తగ్గకపోవడంతో రైతుల ఆందోళన కొనసాగుతోంది.

ఇంత పెద్ద నష్టం ఎప్పుడూ చూడలేదు. ఎకరానికి వందల కిలోల వరి నీటిలో కలిసిపోయింది. మా జీవితం మొత్తం ఈ పంటపైనే ఆధారపడి ఉంది.. అంటూ గుంటూరు జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తక్షణ సహాయం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. తుఫాన్‌ తగ్గిపోయినప్పటికీ, దాని గాయాలు మాత్రం రైతు గుండెల్లో ముద్రపడ్డాయి.

See more ofAndhra Pradesh News Entertainment TR ExclusiveAndhra Pradesh CHANDRA BABU cm pawan kalyan cyclone farmers farmers account hud hud cyclone viral news

Related Posts

Pregnancy: గర్భిణీ స్త్రీలు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా.. వైద్యుల సలహా ఇదే..!

చిటికెడు ఆవాలు.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష.. రోజూ వంటలో ఉంటే శరీరంలో అద్భుత మార్పులివే..!

బీరువా దిశ మారితే భాగ్యం మారుతుందా? వాస్తు ప్రకారం ధనం నిలిచే రహస్యాలు ఇవే..!

మీరు కొన్న అరటిపండు నిజంగానే న్యాచురలేనా? కెమికల్ పండ్లను ఇలా ఈజీగా గుర్తించండి..!

Facebook Twitter Whatsapp Telegram Pinterest Email

Recent Articles

  • Pregnancy: గర్భిణీ స్త్రీలు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా.. వైద్యుల సలహా ఇదే..!
  • చిటికెడు ఆవాలు.. ఆరోగ్యానికి శ్రీరామరక్ష.. రోజూ వంటలో ఉంటే శరీరంలో అద్భుత మార్పులివే..!
  • బీరువా దిశ మారితే భాగ్యం మారుతుందా? వాస్తు ప్రకారం ధనం నిలిచే రహస్యాలు ఇవే..!
  • CAT Movie: CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు
  • Zamana : జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’ …. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
  • Ustaad Bhagat Singh: డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
  • ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’లా ఆద్యంతం అలరించే కమర్షియల్ చిత్రంగా ‘యుఫోరియా’ ఉంటుంది- సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు గుణ శేఖర్
  • Chiranjeevi: పద్మశ్రీ విజేతలు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లను ప్రత్యేకంగా సన్మానించిన మెగాస్టార్ చిరంజీవి
  • “బ్లడ్ రోజస్” ట్రైలర్ ను విడుదల చేసిన నటకిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్, ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!!
  • ఒకే వ్యక్తి మీ కలల్లో మళ్లీ మళ్లీ వస్తున్నారా.. మీ మనస్సు చెబుతున్న రహస్య సందేశం ఇదే..!
  • మీరు కొన్న అరటిపండు నిజంగానే న్యాచురలేనా? కెమికల్ పండ్లను ఇలా ఈజీగా గుర్తించండి..!
  • Tulasi Plant: తులసి మొక్క ఎండిపోతోందా.. ఇలా చేస్తే ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది..!
  • ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే..!
  • Goyaz Silver Jewellery: విజయనగరం లో గోయాజ్‌ సిల్వర్‌ జ్వువెలరీ షోరూం ప్రారంభించిన సినీనటి రితికా నాయక్
  • Rajendra Prasad: నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం నా అదృష్టం, నా తెలుగు ప్రజల ఆశీర్వాదం – రాజేంద్ర ప్రసాద్
  • Heroine Esha Rebba: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ లో శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది: హీరోయిన్ ఈషా రెబ్బా
  • Mohanlal : మోహన్‌లాల్‌ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో శ్రీ గోకులం మూవీస్ భారీ బడ్జెట్ మూవీ అనౌన్స్‌మెంట్
  • Padma Vibhushan: పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు: మెగాస్టార్ చిరంజీవి
  • Oh..! Sukumari: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ‘ఓ..! సుకుమారి’ నుంచి యాదగిరి గా తిరువీర్ ఫస్ట్ లుక్ రిలీజ్
  • Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ, #RT77 పవర్‌ఫుల్‌ టైటిల్ ‘ఇరుముడి’- అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

TeluguRajyam endeavours to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment and information for the audience with an objective of creating an informed public.

Contact us: newsdesk@telugurajyam.com

  • Home
  • Privacy Policy
    • Corrections Policy
    • Ethics Policy
    • Fact-Checking Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright - TeluguRajyam.com