Chiranjeevi And Ys Jagan : ప్రస్తుతం ఏపీ సహా టాలీవుడ్ కి మధ్య పరిస్థితిలు ఎంత రసవత్తరంగా మారిపోయాయి అనేది చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా టికెట్ ధరలు సమస్య టాలీవుడ్ కి పెద్ద చిక్కు గా అనిపిస్తుండగా దీనిపై మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
అయితే ఈ సున్నితమైన అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక కీలక మీటింగులు నిర్మాతలు సహా ఏపీ మంత్రి పేర్ని నానితో జరిగాయి అలాగే మొన్ననే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పాల్గొని లాస్ట్ కి తాను కూడా చేతులెత్తేశాడు. అయితే ఈ అంశంపై మొదటి నుంచి కూడా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి అభ్యర్థిస్తూనే ఉన్నారు.
ఇలా ఎన్నో మార్లు ఈ సమస్యని లేవనెత్తుతున్నా అటు ఏపీ సీఎం వై ఎస్ జగన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోడంతో ఓ సందర్భంలో కనీసం అపాయింట్మెంట్ కి కూడా అవకాశం ఇవ్వడంలేదు అని చేసిన అసహనపు కామెంట్స్ టాలీవుడ్ లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ నుంచి తెలుస్తుంది.
ఫైనల్ గా చిరు కి వై ఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు సమాచారం పక్కా అయ్యింది. ఈ మీటింగ్ ఈరోజే మధ్యాహ్నం జరగనున్నట్టు తెలుస్తుంది. ఈ మీటింగ్ లో చిరు అన్ని అంశాలపై చర్చించి ఒక ముగింపు తీసుకొస్తారని అంతా నమ్ముతున్నారు. దీనితో ఈ మీట్ టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది.