Bheemla Nayak: భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్… కారణం మంత్రి మరణమేనా?

Bheemla Nayak: వకీల్ సాబ్ సినిమా తర్వాత రాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా నుండి పాటలు విడుదలై ఇప్పటికి అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ పొందినట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది

భీమ్లా నాయక్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఎవరు ఊహించని విధంగా పెద్ద షాక్ తగిలింది. భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి తెలంగాణ మంత్రులు కేటీఆర్ తలసాని ముఖ్య అతిథులుగా రానున్నట్టు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మరణించడం వల్ల ఈ ఈవెంట్ రద్దు చేశారు. ఈ క్రమంలో “ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన మృతికి గౌరవ సూచకంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నాం”అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. దీంతో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? ట్రైలర్ సంగతి ఏంటి? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాడు.